వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త కిరణ్ పై గంటల వ్యవధిలోనే చర్యలు
భువనేశ్వరి, చంద్రభాబు , పవన్ కళ్యాణ్ , లోకేష్ , హోంమంత్రి అనిత, తదితరులపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిని వదిలేశారా ?
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ ని పార్టీ నుంచి సస్పండ్ చేసి , , వెంటనే అరెస్ట్ చేశారు. మహిళలపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేస్తే సహించబోమని చెప్పిన మాటపై చంద్రబాబు నిలబడ్డారని ప్రజలలో మంచి పేరు సంపాదించారు. ఈ ఎపిసోడ్ లో పార్టీకి కూడా మైలేజ్ వచ్చింది. ఇంతవరకు ఒకే . కిరణ్ ని అరెస్ట్ చేయడం , సస్పండ్ చేయడం లో ఎవరికీ అభ్య0తరాలు లేవు . ‘తప్పు చేస్తే తమవాడైన వదిలేది లేదు . ‘ అనే సంకేతం పార్టీకి , ప్రభుత్వానికి మంచిదే . కానీ , అరాచకాలు చేసిన అవతలివాళ్ళను మాత్రం వదిలేస్తాం . . మనవాళ్లయితే లోపలేస్తాం . . అన్నట్లు కనిపిస్తోంది చంద్రబాబు ధోరణి.. అంటూ టీడీపీ సీనియర్ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయ్ .
అంతకుముందు . .. అసెంబ్లీ సాక్షిగా వైసీపీ కీలక నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి నేతలు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసభ్య వ్యాఖ్యలు చేసారు. అంతటితో ఆగకుండా వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయించారు. తప్పు తెలుసుకుని తర్వాత క్షమాపణ కూడా చెప్పలేదు . భారతిపై వ్యాఖ్యలు చేసిన కిరణ్ తప్పు తెలుసుకుని ”అలా మాట్లాడటం తప్పే ‘ ‘ అని లెంపలేసుకున్నాడు . అయినా అరెస్ట్ చేశారు . తప్పు అని చెప్పినా వదలమని కాదు . గతంలో భువనేశ్వరి , వంగలపూడి అనిత , చంద్రబాబు నాయుడు , లోకేష్ , పవన్ కళ్యాణ్ వంటి నేతలపై అసభ్య పదజాలాలతో విరుచుకుపడ్డారు . ఒకరోజు , రెండు రోజులు కాదు . . నెలల తరబడి జుగుప్సాకర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు . అయినా వారిపై ఎలాంటి చర్యలు లేవు . చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు . అరాచకవాదుల ఆట కట్టిస్తాడనుకున్నారు . కానీ ఒకరిద్దరిని లోపలేశారు . చేతులు దులుపుకున్నారు . . అన్నట్లు చేస్తున్నారు . వైసీపీ అరాచకవాదులు ఇంకా పదుల సంఖ్యలో బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు . అయినా వారిపై చర్యలకు కూటమి సర్కార్ , ముక్యంగా సీఎం చంద్రబాబు చొరవ తీసుకోకపోవడానికి కారణాలపై టీడీపీ , జనసేన కేడర్ లలో అనుమానాలు రేకెత్తుతున్నాయి . వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు , లోకేష్, పవన్ కళ్యాణ్ లపై నే ఉంది .