అమరావతి దూసుకుపోతుందా ?

Srinivas Vedulla

April 10, 2025

ఆంధ్రుల రాజధాని అమరావతి నిజంగానే దూసుకుపోతుందా? కూటమి నేతలు చెపుతున్నట్టు ‘ప్రపంచంలోనే టాప్ – 5 సిటీస్ ‘ లో చోటు దక్కించుకుంటుందా ? వీరు చేస్తున్న ప్రకటనలకు , ఫీల్డ్ లో జరుగుతున్న పనులకు పొంతన కనిపిస్తుందా ? కనీసం పదేళ్ళకయినా ప్రపంచ నగరాలతో పోటీపడే ప్లాన్ తో అమరావతి నిర్మాణం కొనసాగుతుందా ?

ఈ నేపథ్యంలో నాలుగైదేళ్ల వరకు అమరావతి ప్రాంతంలో భూముల ధరలలో పెద్ద మార్పు ఉండకపోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు . అయితే ప్లాట్లు యజమానులు మాత్రం …. ఇపుడు ప్రకటించిన ప్రాజెక్టులు ప్రారంభం అయితే . .. ఐదారు నెలలలోనే గజం లక్షకు పెరుగుతుందని ఆశతో ఉన్నారు.

హైదరాబాద్ ఎఫెక్ట్ : 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రా నుంచి పెట్టుబడులు హైదరాబాద్ తరలిపోయాయి . ఆ సమయంలో హైదరాబాద్ మంచి హైప్ లో ఉంది. అక్కడ వందల కోట్ల రూపాయలు పెట్టి భూములు , విల్లాలు కొనుగోలు చేశారు . ఇటీవల రెండేళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనం అంచున సాగుతోంది . ఈ నేపథ్యంలో అక్కడ విక్రయించి . . అమరావతిలో పెట్టుబడులు పెడదామని భావిస్తున్న ఆంధ్రులకు అవకాశం దొరకడంలేదు . దీంతో అమరావతికి వచ్చే పెట్టుబడులు నిరాశాజనకంగా ఉన్నట్లు రియల్ ఎస్టేట్ సంస్థలు భావిస్తున్నాయి.

పదేళ్ల సమయం పడుతుంది : అమరావతి విశ్వనగరంగా అవతరించాలంటే కనీసం పదేళ్ల సమయం పడుతుంది . ఇపుడు జరుగుతున్న అభివృద్ధికి బ్రేక్ లేకుండా . .. 2029 లో కూడా కూటమి అధికారంలోకి వస్తే ఈ పనులు కొనసాగుతాయి . పొరపాటునో , గ్రహపాటునో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చిందంటే అమరావతిని మళ్ళీ భ్రష్టు పట్టించారని చెప్పలేం . .. ఇదే కారణంతో అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మెజారిటీ పెట్టుబడిదారులు తటపటాయిస్తున్నారు . దీనిపై కూటమి సర్కార్ , ,, కేంద్ర పెద్దలతో మాట్లాడుకుని జనంలో బలమైన నమ్మకం కలిగేలా చేయగలగాలి . లేకపోతె చంద్రబాబు చెపుతున్న కబుర్లకు , జరుగుతున్న పనులకు కొంత గ్యాప్ ఉండటంతో ప్రజల్లో విశ్వాసం కలగదు. దీనిని కూటమి నేతలు గుర్తెరగాలి .

You May Also Like…