by Srinivas Vedulla | Apr 8, 2025 | క్రీడలు
IPL హిస్టరీలో తొలి కెప్టెన్గా రికార్డు! – RAJAT PATIDAR 2025 IPL
ఆడిన నాలుగు మ్యాచుల్లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఆర్సీబీ 2025 ఐపీఎల్ సీజన్ని అద్భుతంగా స్టార్ట్ చేసింది. ఆరు పాయింట్లతో టేబుల్లో మూడో ప్లేస్లో ఉంది. అనేక సంవత్సరాలుగా కొంతమంది స్టార్ ప్లేయర్లపైనే అతిగా ఆధారపడిన ఆర్సీబీ ఇప్పుడు బ్యాలెన్స్డ్గా కనిపిస్తోంది. బలమైన జట్టును నిర్మించి, టీమ్ని అద్భుతంగా నడిపిస్తున్న కెప్టెన్ రజత్ పటీదార్కే ఈ క్రెడిట్ దక్కుతుందని క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్సీబీ ప్రస్తుత సీజన్ ప్రారంభంలో గ్రాండ్ విక్టరీలు అందుకుంది. టాప్ టీమ్లు కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ ని హోమ్ గ్రౌండ్లో ఓడించింది. వరుసగా ఈడెన్ గార్డెన్స్, చెపాక్ వాంఖడేలో అద్భుత విజయాలు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో మరే ఇతర కెప్టెన్ కూడా ఒకే సీజన్లో ఇలా చేయలేక పోయాడు. అరుదైన ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా పటీదార్ నిలిచాడు.అలానే ఓ అరుదైన రికార్డును పటీదార్ సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్లో ఒకే సీజన్లో రెండు జట్లు మాత్రమే తమ సొంత స్టేడియంలలో KKR, CSK, MIలను ఓడించాయి. మొదట పంజాబ్ కింగ్స్ (గతంలో కింగ్స్ XI పంజాబ్ ) 2012లో ఈ ఘనత అందుకుంది. అయితే ఆ జట్టు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లు ఆడమ్ గిల్క్రిస్ట్, డేవిడ్ హస్సీ నేతృత్వంలో ఓడించింది. తాజాగా ముంబయిపై ఆర్సీబీ వాంఖడేలో గెలవడంతో అరుదైన రికార్డు అందుకున్న ఏకైక కెప్టెన్గా పటీదార్ నిలిచాడు. ఇది తమకెంతో గర్వకారణంగా ఉందని జట్టులో ఉన్న ఇతర ఆటగాళ్లు హ్యాపీగా చెపుతున్నారు.
by Srinivas Vedulla | Apr 8, 2025 | ఆరోగ్యం
స్టూడెంట్స్ ఊబకాయం..పొంచి ఉన్న ఫ్యాటీ లివర్ ప్రమాదం
నలుగురు కళాశాల విద్యార్థులలో ఒకరు ఊబకాయం, ఐదుగురిలో ఒకరు ప్రీ-హైపర్టెన్సివ్: ‘అపోలో హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025 నివేదిక’
భారతదేశంలో ఫ్యాటీ లివర్ వ్యాధి పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. 257,199 మంది స్క్రీనింగ్ చేయబడిన వ్యక్తులలో 65% మంది దీని బారిన పడ్డారు. ముఖ్యంగా, వారిలో 85% మంది ఎప్పుడూ మద్యం సేవించలేదు, దీనిని జీవక్రియ సమస్యగా వైద్య నిపుణులు హైలైట్ చేస్తున్నారు.
అపోలో నివేదిక ఏమి చెపుతుంది?: అపోలో హాస్పిటల్స్ ఇటీవల జరిపిన పరిశోధన ఫలితాలు.. నివేదిక ప్రకారం, నలుగురు భారతీయ కళాశాల విద్యార్థులలో ఒకరు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు అధిక రక్తపోటు యొక్క ప్రారంభ సంకేతాలను కలిగి ఉంటున్నారు. 2.5 మిలియన్ల మందిపై నిర్వహించిన స్క్రీనింగ్ల ఆధారంగా, “హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025” నివేదిక, రక్తపోటు మరియు మధుమేహం వంటి పెరుగుతున్న ఆరోగ్య సమస్యల తీవ్రతను తెలియచేస్తోంది.
.ఏప్రిల్ 7న ప్రారంభించబడిన ‘’హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025 నివేదిక’’, అపోలో ఆసుపత్రులు, క్లినిక్లు మరియు వెల్నెస్ సెంటర్లలో 2.5 మిలియన్లకు పైగా ప్రజల ఆరోగ్య పరీక్షల ఆధారంగా రూపొందించబడింది.
పరీక్షించబడిన విద్యార్థులలో, 28 శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నట్లు ఈ నివేదిక తేటతెల్లం చేస్తోంది. అయితే 19 శాతం మంది ప్రీ-హైపర్టెన్సివ్గా ఉన్నారు – అంటే వారి రక్తపోటు సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రమాద స్థాయికి దగ్గరలో ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అన్ని వయసులవారిలో, 26 శాతం మంది ఇప్పటికే అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని మరియు 23 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారని, ఎటువంటి లక్షణాలు కనిపించకపోయినా, నివేదిక వెల్లడిస్తుంది. .
ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి లక్షణాలపై ఆధారపడటం ఇకపై సరిపోదని అపోలో నివేదిక సూచిస్తోంది. ఇది యువకులు మరియు పెద్దలు ఇద్దరూ క్రమం తప్పకుండా నివారణ ఆరోగ్య తనిఖీలు చేయించుకోవడానికి సంకేతాలు ఇచ్చినట్లవుతుంది.
ఈ నివేదిక నేడు భారతదేశంలో మూడు ప్రధాన ఆరోగ్య సవాళ్లను కూడా హైలైట్ చేస్తుంది: కొవ్వు కాలేయ వ్యాధి, రుతుక్రమం ఆగిపోయిన తర్వాత ఆరోగ్య క్షీణత మరియు బాల్య ఊబకాయం, ప్రారంభ జీవనశైలి మార్పులు మరియు వ్యక్తిగతీకరించిన సంరక్షణ కోసం పిలుపునిచ్చింది.
ఈ సందర్బంగా అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి ఒక ప్రకటనలో ఊబకాయులు తీసుకోవాల్సిన ఆరోగ్య చర్యలపై వివరించారు. “ప్రతి ఇంటి గుండెలో ఆరోగ్యాన్ని ఉంచడం ద్వారా భారతదేశం ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కుటుంబాలను సృష్టించే అవకాశాన్ని పొందాలి. నివారణ ఆరోగ్య సంరక్షణ ఇకపై భవిష్యత్ ఆశయం కాదు – ఇది నేటి దేశ శ్రేయస్సుకు మూలస్తంభం. ముందస్తుగా చర్య తీసుకోవడం, లోతుగా పరీక్షించడం మరియు ప్రతి పౌరుడికి జ్ఞానం మరియు ప్రాప్యతతో సాధికారత కల్పించడం అనే మన సమిష్టి బాధ్యతను ఈ నివేదిక ధృవీకరిస్తుంది. ప్రతి విద్యా పాఠ్యాంశాలు, కార్పొరేట్ ప్రయోజనాలు మరియు కుటుంబ దినచర్యలలో నివారణ సంరక్షణను ఏకీకృతం చేయాల్సిన సమయం ఇది. అప్పుడే మనం అనారోగ్యానికి చికిత్స చేయడం నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వైపు మళ్లగలం మరియు రాబోయే తరాలకు స్థితిస్థాపకంగా, ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్ధారించగలం.” అని రెడ్డి స్పష్టం చేశారు.
ఫ్యాటీ లివర్: ఎ న్యూ మెటబాలిక్ అలార0
నివేదిక ప్రకారం, ఫ్యాటీ లివర్ వ్యాధి భారతదేశం యొక్క అతిపెద్ద నిశ్శబ్ద ముప్పులలో ఒకటిగా మారుతోంది. పరీక్షించబడిన 257,199 మందిలో 65 శాతం మందికి ఫ్యాటీ లివర్ ఉన్నట్లు కనుగొనబడింది మరియు వారిలో 85 శాతం మంది ఎప్పుడూ మద్యం సేవించలేదు—ఇది కేవలం కాలేయ సమస్య కాదు, పూర్తి స్థాయి జీవక్రియ సమస్య అని నిరూపిస్తోంది.
ఆశ్చర్యకరంగా, ప్రభావితమైన వారిలో సగానికి పైగా సాధారణ రక్త పరీక్షలు చేయించుకున్నారు, సాంప్రదాయ స్క్రీనింగ్ మాత్రమే తరచుగా దాచిన ప్రమాదాలను కోల్పోతుందని చూపిస్తుంది.
“పరీక్షించబడిన వారిలో 66 శాతం మందికి ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు – వారిలో 85 శాతం మంది ఆల్కహాల్ లేనివారు – ఇది కొత్త రోగ నిర్ధారణలు మరియు స్థాయిలో ముందస్తు గుర్తింపు కోసం ఆవశ్యకతను సూచిస్తుంది. సాంప్రదాయ స్క్రీనింగ్ ఇకపై సరిపోదు. అపోలో యొక్క ప్రోహెల్త్ కార్యక్రమం వ్యక్తులు తమ ఆరోగ్యాన్ని నియంత్రించుకోవడానికి అధికారం ఇవ్వడం మాత్రమే కాదు; ఇది స్కేలబుల్ మరియు ప్రిడిక్టివ్ హెల్త్కేర్కు పునాది వేస్తోంది. నివారణ భారతదేశం యొక్క అత్యంత స్కేలబుల్ హెల్త్కేర్ పరిష్కారం, మరియు అపోలో యొక్క లక్ష్యం నివారణ ఆరోగ్యాన్ని ప్రజాస్వామ్యీకరించడం, ”అని అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీతా రెడ్డి చెపుతున్నారు.
నిద్ర రుగ్మతలు: నలుగురిలో ఒకరు OSA ప్రమాదంలో ఉన్నారు
నిద్ర ఆరోగ్యంలో కూడా ఆందోళనకరమైన ధోరణి ఉద్భవించింది. పరీక్షించబడిన 53,000 మందిలో, 24 శాతం మందికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) ప్రమాదం ఎక్కువగా ఉంది – ఇది ఊబకాయం మరియు గుండె జబ్బులతో దగ్గరి సంబంధం ఉన్న నిద్ర రుగ్మతగా రుజువయింది. .
33 శాతం మంది పురుషులు మరియు 10 శాతం మంది మహిళలు అధిక ప్రమాదం ఉన్నట్లు కనుగొనబడింది, 55 సంవత్సరాల తర్వాత ప్రాబల్యం పెరుగుతుంది. OSA తరచుగా నిర్ధారణ చేయబడదు, ఒత్తిడి లేదా అలసటగా తప్పుగా భావించబడుతుంది.
40 ఏళ్లలోపు వారిలో కూడా, దాదాపు సగం మంది పురుషులు మరియు మూడింట ఒక వంతు మంది స్త్రీలు విటమిన్ B12 లోపంతో బాధపడుతున్నారు – ఇది శక్తి, జ్ఞానం మరియు జీవక్రియను ప్రభావితం చేసే సమస్యగా పరిశోధకులు సెలవిస్తున్నారు.
సూక్ష్మపోషక అంతరాలు విస్తృతంగా ఉన్నాయి. 77 శాతం మంది మహిళలు మరియు 82 శాతం మంది పురుషులు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు, అయితే విటమిన్ B12 లోపం 38 శాతం మంది పురుషులు మరియు 27 శాతం మంది స్త్రీలను ప్రభావితం చేసింది
by Srinivas Vedulla | Apr 8, 2025 | ఆంధ్రప్రదేశ్
అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా అరకు, పరిసర గురుకుల పాఠశాల విద్యార్థులు అరుదైన ప్రపంచ రికార్డు సాధించారు . ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఒకేసారి 21,850 మంది గిరిజన బాలబాలికలు 108 సూర్య నమస్కార ఆసనాలతో చరిత్ర సృష్టించారు. రాజమండ్రికి చెందిన ప్రముఖ యోగ గురువు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం అల్లూరి జిల్లా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ ప్రదర్శన ఈ వరల్డ్ రికార్డ్ కి వేదికయింది . లండన్ నుంచి వచ్చిన ప్రపంచ రికార్డు యూనియన్ మేనేజర్ అలీస్ రేనాడ్ కార్యక్రమాన్ని పరిశీలించి ప్రపంచ రికార్డుగా నమోదు చేశారు. రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని కలెక్టర్ దినేశ్కుమార్కు అందజేశారు. యోగ గురువు పతంజలి శ్రీనివాస్ . .. గిరిజన విద్యార్థులకు దశాబ్ద కాలంగా యోగలో శిక్షణ ఇస్తున్నారు. శ్రీనివాస్ నిస్వార్ధ సేవలకు గాను కలెక్టర్ . . దినేష్ ఎక్కడికి బదిలీ అయినా . . ఆయా ప్రాంతాలలో గిరిజనులకు శ్రీనివాస్ సేవలు వినియోగిస్తున్నారు .
by Srinivas Vedulla | Apr 8, 2025 | సినిమా
ఇమేజ్ కోసమా ? అప్పటి కామెడీని కంటిన్యూ చేయడంపై భయమా ?
టాలీవుడ్ లో ఏ కేరెక్టర్ అయినా ఇట్టే ఒదిగిపోగల నటుడు జూనియర్ ఎన్టీఆర్ . తాను పోషించిన పాత్రకు 100 శాతం న్యాయం చేయగల అరుదైన నటులలో ముందువరసలో ఉంటారు తారక్. అయినా అదుర్స్ సీక్వల్ ఎందుకు చేయనంటున్నారు ఈ యాక్టర్.
”అన్ని కేరెక్టర్ లలోకి కామెడీ చేయడమే కష్టం. అందునా అదుర్స్ లో చేసిన కామెడీ ఇప్పుడు చేయాలంటే నాకు భయంగానే ఉంది. మళ్ళీ ఆ టెంపో వస్తుందో లేదో అన్న ఆందోళన ఉంది . అందుకే అదుర్స్ – 2 చేయనని చెపుతున్నాను . చేయనంటే .. ఇప్పట్లో చేయనని చెపుతున్నాను . ..” అని ఇటీవల ఓ సినిమా ఫంక్షన్ లో చెప్పుకొచ్చారు జూనియర్. ఔన్ మరి అతను చెప్పింది నిజమే . .. అప్పట్లో అదుర్స్ లో ఎన్టీఆర్ , బ్రహ్మనందం కాంబినేషన్ కూడా అంతలా అదిరింది. ఒక విధంగా చెప్పాలంటే జూనియర్ అప్పట్లోనే ప్రయోగం చేశారనే చెప్పాలి . అంతకు ముందు సింహాద్రి వంటి వయొలెన్స్ సినిమాలు చేసి . .. సడన్ గా పూర్తీ స్థాయి హాస్య ప్రధాన పాత్ర చేయడం సాహసమే . అందునా తెలుగులో ఇలాంటి ప్రయోగాలు పొరపాటున వికటిస్తే ఇక సదరు ప్రయోగం చేసిన నటుడి కెరీర్ దాదాపు క్లోస్ అనే చెప్పాల్సి ఉంటుంది . ఆంత సాహసం చేసినందుకే జూనియర్ కి ఇప్పటికీ అదుర్స్ ఒక మైలురాయిలా మిగిలిపోయింది .
by Srinivas Vedulla | Apr 7, 2025 | బిజినెస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన భారీ సుంకాల ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కుప్పకూలిపోయాయి. ట్రంప్ ప్రతీకార సుంకాలు విధిస్తూ వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించడంతో, చైనా కూడా రివెండ్ టారిఫ్స్తో ఎదురుదాడి చేసింది. దీనితో వాణిజ్య యుద్ధ భయాలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫలితంగా మదుపరుల సంపద సోమవారం మార్కెట్ ఓపెన్ అయిన నిమిషాల వ్యవధిలోనే .. ఏకంగా రూ.20 లక్షల కోట్ల మేర ఆవిరైంది.
- ఈ సెషన్స్ లో టాటా మోటార్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. వాస్తవానికి అమెరికాలోకి దిగుమతి అయ్యే ఆటోమొబైల్ ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించిన రోజే ఈ కంపెనీ షేర్లు కుదేలయ్యాయి . ఈ నేపథ్యంలోనే టాటా మోటార్స్కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమెరికాకు ఎగుమతులను నిలిపివేసిందన్న వార్తలు రావడంతో టాటా మోటార్స్ షేర్లు ఇంట్రాడేలో 10 శాతం మేర క్షీణించి రూ.552 వద్ద లోయర్ సర్క్యూట్ను తాకాయి.
- టాటాలకు చెందిన రిటైల్ సంస్థ ట్రెంట్ షేర్లు కూడా నేడు భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 19.2 శాతం పతనమై రూ.4,491 వద్ద కనిష్ఠాన్ని తాకాయి. 2020 మార్చి తర్వాత కంపెనీ షేర్లు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
- అలాగే టాటా గ్రూపునకు చెందిన టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ట్రెంట్ కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడి కారణంగా, మొత్తంగా రూ.1.28 లక్షల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయాయి.
చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 2,226 పాయింట్లు నష్టపోయి 73,137 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 742 పాయింట్లు కోల్పోయి 22,161 వద్ద ముగిసింది. ఇంత దారుణమైన పతనంలోనూ కొన్ని షేర్స్ లాభపడ్డాయి .
- లాభపడిన షేర్లు : హిందూస్థాన్ యూనిలివర్
- నష్టపోయిన షేర్లు : టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, ఎస్బీఐ, సన్ఫార్మా, టైటాన్, టీసీఎస్.
-
- కేంద్రం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని ఒక్కొక్కటి రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయం భారతదేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీల (OMCలు) షేర్ ధరలలో గణనీయమైన తగ్గుదలకు దారితీసింది. కీలకమైన OMCలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL), దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల రిటైల్ మార్కెటింగ్, పంపిణీకి ప్రధాన భూమిక వహిస్తాయి. ఈ ప్రకటన తర్వాత, ఆయా ఆయిల్ కంపెనీల స్టాక్ ధరలు భారీగా తగ్గాయి
- ఏయే కంపెనీలు ఏ మేరకు తగ్గాయి:
- BPCL: 6.24% తగ్గాయి
- HPCL: 4.31% తగ్గాయి
- IOC: 5.99% తగ్గాయి