by Srinivas Vedulla | Apr 17, 2025 | ఆంధ్రప్రదేశ్
గతంలో 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులలో గందరగోళం..
మరో 44 వేల ఎకరాలు తీసుకుంటే,, ఈ భూములు ఎవరు కొంటారు ? రెండవ దఫా భూ సమీకరణ చేపడతారన్న భయంతో ముందు తీసుకున్న భూముల లావాదేవీలపై స్తబ్దత
అమరావతి రైతులతో కూటమి సర్కార్ ఆటలాడుకుంటోంది. గతంలో సమీకరించిన 33 వేల ఎకరాల రైతులకు పూర్తిగా ప్లాట్స్ కేటాయింపు ప్రక్రియ జరగకుండానే . . రెండో దఫా పూలింగ్ కోసం సర్కార్ సన్నాహాలు చేస్తోంది.
గందరగోళంలో రియల్ ఎస్టేట్ : అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణ చేపట్టడానికి కూటమి సర్కార్ సన్నాహాలు చేస్తున్న వార్తలు రావడంతో ఈ ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే ఉన్న వేల ఎకరాలలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా మరో 44 వేల ఎకరాల సమీకరణ చేస్తే . .. ఈ ప్రాంతంలో భూముల ధరల గణనీయంగా తగ్గుతాయన్న అంచనాలు వస్తున్నాయ్ . ఈ ప్రభవవంతో 2nd పేజ్ – లాండ్ పూలింగ్ లీకులు వచనప్పటి నుంచి 29 గ్రామాల పరిధిలో భూముల క్రయవిక్రయాలపై నీలినీడలు అలుముకున్నాయి .
గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరిస్తే.. విజయవాడ సమీపంలో గన్నవరంలో విమానాశ్రయం ఉంది . దీనికి 1200 ఎకరాల భూమి గతంలో సేకరించారు. అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపొందించాలంటే . . దీనికే మరో 2 వేల ఎకరాల భూసమీకరన్ చేస్తే సరిపోతుంది. రాజధాని భూ సమీకరణ ప్యాకేజ్ టైప్ లో చేస్తే రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వస్తారు . చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు ఎయిర్ పోర్ట్ కి సమీపంలో ఐటీ , AI వంటి కార్యాలయాలు ఉంటె బాగుంటుంది . ఇదే విమానాశ్రయం సమీపంలో, లేదా విమానాశ్రయానికి చేర్చి . . మరో 4,5 వేల ఎకరాల భూమి తీసుకునే విధానాన్ని చంద్రబాబు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆందోళనలో అమరావతి రైతులు : ”చంద్రబాబు అధికారంలోకి వచ్చి 10 నెలలయింది . ఆరేడు నెలలుగా రైతుల ప్లాట్లలలో మొలిచిన తుప్పలనే ఇంకా తొలగించలేకపోయారు . అలాంటిది మిగిలిన నాలుగేళ్లలో ఏమి చేయగలరు ? ఎంతవరకు చేయగలరు ? కొత్త నగరం నిర్మించాలంటే కావాల్సిన ప్రాధమిక రహదారులు శరవేగంగా నిర్మిస్తే అభివృద్ధి దానంతట అదే నడుస్తుంది . ఈ ప్రాధమిక సూత్రాన్ని కూడా చంద్రబాబు పట్టించుకోవడంలేదు . విశ్వ నగరం నిర్మిస్తా . .. అంటూ ప్రగల్బాలు పలుకడం మానుకోవాలి . ” అంటూ తుళ్లూరుకు చెందిన చాగంటి మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు .
”ల్యా0డ్ పూలింగ్-2 అంశం తెరపైకి తేవడం వల్ల . .. ఇపుడిపుడే నడుస్తున్న అమరావతి రియల్ ఎస్టేట్ పై పిడుగుపడినట్లయింది. ఇలాంటి గందరగోళ పరిస్థితులు క్రియేట్ చేస్తే చంద్రబాబు నాయుడుపై వ్యతిరేకత పెరుగుతుంది. విశ్వాసం కోల్పోయి తర్వాత అమరావతిని , రాష్ట్రాన్నీ ముంచేస్తారన్న భయం కలుగుతుంది . .. ‘ అని వెలగపూడి కి చెందిన ”శివన్నారాయణ అనే ఆటో కార్మికుడు ఆవేదన వ్యక్తం చేసారు .
చంద్రబాబు నుంచి అమరావతిని కాపాడాలి : ‘ గతంలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలన నుంచి అమరావతికి విముక్తి కలిగించాలని ఎందరో దేవుళ్ళకు మొక్కుకున్నాం. ఎన్నో ఆందోళనలు చేసాం . చంద్రబాబు వచ్చారని ఎంతో సంబరపడ్డాం . కానీ ఇతని పిచ్చి ఆలోచనలు చూస్తుంటే వీళ్ళే అమరావతిని ముంచేస్తారనిపిస్తోంది . .” అని వడ్లమానుకు చెందిన రాజధాని ఉద్యమ మహిళా నాయకురాలు చెప్పుకొచ్చారు .
by Srinivas Vedulla | Apr 17, 2025 | జాతీయం
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకు దూరంగా భారత్- డైరెక్టర్ మరియా నీరా కీలక వ్యాఖ్యలు
“గుండె జబ్బులు, కేన్సర్ , బ్రెయిన్ స్ట్రోక్ వంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లు (NCDs) రావడానికి వాయు కాలుష్యం ఒక కారణం. సెప్టెంబర్లో జరగబోయే యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఈ అంశంపై లోతుగా చర్చ జరుగుతుంది. వాయు కాలుష్యంపై మనం పోరాడుతున్నప్పుడు, NCDల ముప్పు కూడా తగ్గుతుంది. ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్లో ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, వాయు కాలుష్యం కేవలం ఢిల్లీ సమస్య మాత్రమే కాదు. భారతదేశంలోని అనేక ప్రాంతాలు WHO మార్గదర్శకాల కంటే చాలా దారుణమైన గాలి నాణ్యతను ఎదుర్కొంటున్నాయి. కొన్ని ప్రాంతాలు మరింత దారుణమైన స్థాయికి చేరుకున్నాయి” – – డబ్ల్యూహెచ్ఓ హెల్త్ వింగ్ డైరెక్టర్ డాక్టర్ మరియా నీరా (Dr.Maria Neira)
భారత దేశంలో గాలి నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన సాధారణ ప్రమాణాల కంటే చాలా తక్కువగా ఉంది. దేశ జనాభాలో 40% కంటే ఎక్కువ మంది ఇప్పటికీ వంట చేసుకోవడానికి కాలుష్య కారకాలైన కట్టెలు, పిడకలను ఉపయోగిస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ పర్యావరణం, వాతావరణ మార్పు, ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ మరియా నీరా (Dr.Maria Neira), ఆందోళన వ్యక్తం చేసారు . భారత్లో క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు తక్షణ చర్యలు అవసరమని నీరా సూచించారు .
డాక్టర్ నీరా ఇటీవల పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ . .. , గృహ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి భారతదేశం ఎల్పీజీ సబ్సిడీ వంటి పథకాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కువ మందికి చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. “పథకాల నుంచి మంచి ఫలితాలను చూశాం. కానీ 41% భారతీయ గృహాలు ఇప్పటికీ బయోమాస్ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇంకా ఎక్కువ కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైంది.” అని స్పష్టం చేసారు .
by Srinivas Vedulla | Apr 16, 2025 | సినిమా
2026 మార్చి 27 న పెద్ది విడుదల .. అంతవరకూ మెగా అభిమానులకు వెయిటింగే
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… ‘ఉప్పెన’ ఫేమ్ సానా బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సిని మాపై ఇండిస్ట్రిలో అమితాసక్తి నెలకొంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన గ్లింప్స్ కి సూపర్-డూపర్ రెస్పాన్స్ వచ్చింది.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ చేస్తున్నారు. పెద్దిలో అలనాటి అందాలతార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ‘పెద్ది’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయం దర్శకుడు బుచ్చిబాబు ఇదివరకే ప్రకటించారు. ఈ సినిమాలో మరో సూపర్ స్టార్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ సూపర్ స్టార్ ఎవరనేది మరికొన్ని రోజులల్లో వెల్లడిచేయనున్నారు..
ఆ స్టార్ సూర్య అని ఇటీవల ప్రచారం సాగుతోంది. నిడివి తక్కువే అయినప్పటికీ పవర్ ఫుల్ రోల్. దీనికి సూర్య కూడా అంగీకరించినట్లు టాక్.
by Srinivas Vedulla | Apr 15, 2025 | జనరల్
ఏకకాలంలో 50వేల మందితో భోజనాలు- ఉజ్జయినిలోని నాగర్ భోజ్ భండారా వరల్డ్ రికార్డు- 25 డబ్బాల దేశీ నెయ్యి, 60 కిలోల డ్రై ఫ్రూట్స్తో నోరూరించే వంటకాలతో పసందైన విందు
వెయ్యి మందికి భోజనాలు పెట్టాలంటేనే పెద్ద హంగామా చేయాలి. పదిమంది ఆ పనిలో నాలుగైదు రోజులు బిజీగా ఉండాల్సిన పరిస్థితి . అలాంటిది ఏకంగా 50 వేల మందికి ఏకకాలంలో భోజనాలు పెట్టడమంటే మాటలా … అందుకే ఇది వరల్డ్ రికార్డ్ ని సొంతం చేసుకుంది.
ఆంజనేయ స్వామి జయంతి సందర్బంగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని.. అంబాపూర్లో ఈ ఘనత చోటుచేసుకుంది . ఆ ఊరిలో ఉన్న పురాతన ‘జై వీర హనుమాన్’ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక భోజన కార్యక్రమం (భండారా) గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్తానం సంపాదించింది. ఈ కార్యక్రమానికి ‘నాగర్ భోజ్’ అని పేరు పెట్టారు . ఇందులో 50 వేల మంది హనుమాన్ భక్తులు ఏకకాలంలో ఆలయ ప్రసాదాన్ని తిన్నారు. వారంతా ఆలయ ప్రాంగణంలో బల్లలు, కుర్చీలపై కూర్చొని సాంప్రదాయ మాల్వా వంటకాలైన దాల్ బఫ్లా, లడ్డూ, కడీలను భుజించారు. భక్తులకు 600 మంది వాలంటీర్లు , కార్మికులు ఆహారాన్ని వడ్డించారు.
ఆహార పదార్దాల తయారీ కోసం 45 క్వింటాళ్ల బాఫ్లా గోధుమ పిండి, 7 క్వింటాళ్ల కంది పప్పు, 5 క్వింటాళ్ల పెరుగు, 6 క్వింటాళ్ల రవ్వ, 200 లీటర్ల పాలు, 25 డబ్బాల దేశీ నెయ్యి, 60 కిలోల డ్రై ఫ్రూట్స్ను వినియోగించారు.
— సామూహిక భోజన కార్యక్రమంలో వడ్డించిన వంటకాలను 70 మంది పాకశాస్త్ర నిపుణులతో కూడిన బృందం తయారు చేసింది.
-ఏకకాలంలో 50వేల మందితో జరిగిన ఈ విందు కార్యక్రమాన్ని దిల్లీకి చెందిన గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బృందం లార్జ్ స్కేల్ ఫుడ్ సర్వింగ్ ఆన్ చైర్-టేబుల్ విభాగం చేర్చింది. రికార్డుకు సంబంధించిన సర్టిఫికెట్ను జైవీర్ హనుమాన్ ఆలయ కమిటీ నిర్వాహకులకు ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ ఆసియా హెడ్ డాక్టర్ మనీష్ విష్ణోయ్, న్యాయ నిర్ణేత వేదాంత్ జోషి ప్రదానం చేశారు.
by Srinivas Vedulla | Apr 14, 2025 | ఆంధ్రప్రదేశ్
34 వేల ఎకరాలు సరిపోదట .. మరో 44,670 ఎకరాలు భూమి సమీకరిస్తారట. వేల రైతు కుటుంబాలతో చంద్రబాబు ‘రిస్క్ గేమ్ ‘ ఆడటం ఎంతవరకు కరెక్ట్ ?
Chandrababu is working to sink Amaravati. If this trend continues, Andhra Pradesh will also sink.
అమరావతిలో గతంలో సేకరించిన భూములనే ఇంకా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. కనీసం 10 శాతం పనులు కూడా చేపట్టలేదు. 2014-2019 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు హడావుడి చేసి . .. అభాసుపాలయ్యారు. 2019-2024 మధ్య సీఎంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ అరాచకాలను తరిమికొట్టాలని కంకణం కట్టుకున్న జనం ప్రత్యామ్నయంగా చంద్రబాబు , పవన్ కళ్యాణ్ , బీజేపీ కూటమిని గద్దెనెక్కించారు. కూటమి బలం కంటే . . జగన్ అరాచకాలకు భయపడి కూటమికి ఓట్లేసి గెలిపించిన ఎన్నికగా చరిత్రలో నిలిచిపోయిన ఎన్నిక అది .. ఈ మాత్రం చంద్రబాబు అండ్ కో కు బుర్ర, బుద్ధి లేకుండా ఉన్నాయా ? ”అమరావతిలో అనుకున్న పనులేవీ ఇంకా ఆరంభించనేలేదు . . ఉన్న భూములు సరిపోవని , మరో భారీ భూసేకరణకు సిద్ధం కావడం చూస్తుంటే అమరావతిని చంద్రబాబు ముంచేలా కనిపిస్తున్నాడు.. అమరావతినే కాదు . .చంద్రబాబు పాలన ఇదే ధోరణితో సాగితే ఆంధ్రప్రదేశ్ నే ముంచేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు . …
మెజార్టీ ఆంధ్ర ప్రజల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ముచేసేలా కనిపిస్తోంది. ”అమరావతిని విశ్వ నగరం’గా తీర్చిదిద్దుతానంటూ పదేపదే ప్రకటనలు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు . … ప్రకటనలంత బలంగా పనులు మాత్రం చేయించుడలేకపోతున్నారు. కూటమి అధికారం చేపట్టి పది నెలలు దాటుతున్నా . .. 2016 లో రాజధాని కోసం భూములు సేకరించిన రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు తయారు చేసి ఇవ్వలేకపోయారు.
అమరావతిలో గతంలో సమీకరించిన భూములకు సైతం చెప్పుకోదగ్గ ధర పలకడంలేదు. కొర్ కేపిటల్ లో మాత్రం కొంతవరకు నడుస్తోంది. (90 శాతం మందికి 2018-2019లో ఇచ్చారు . వాటిని జగన్ సర్కార్ నిర్వాకంతో తుప్పలు మొలిపించి చెల్లాచెదురు చేశారు . . . వాటిని క్లియర్ చేసి రైతులకు ఇవ్వాల్సి ఉంది)
”అమరావతి భూ సమీకరణ వరల్డ్ రికార్డ్. 34 వేల ఎకరాల భూమిని 29,650 మంది రైతుల నుంచి సమీకరించి . . సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా రూపొంచాలని ప్లాన్ చేశారు ” నిజంగా ఇది చారిత్రాత్మకం . అయితే రెండో విడత భూ సమీకరణ అంత ఆషామాషీగా ఉండదు . ..
ఉన్న భూములలోనే మొదలెట్టలేదు . . 44,670 ఎకరాలు ఏంచేస్తారు ?
ఇప్పటికే 34 వేల ఎకరాలు అమరావతి నిర్మాణం కోసం సేకరించారు. ప్రభుత్వ , అటవీశాఖకు చెందిన భూములు మరో 4,500 ఎకరాల వరకు ఉంది . మరో 3,500 ఎకరాలు సేకరించాలని గత0లోనే భావించారు. ఇంతవరకు బాగానే ఉంది. 2016లో భూములు సమీకరణ చేసినా . .. … టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని బిల్డింగ్స్ మాత్రమే నిర్మించగలిగారు. సచివాలయం నిర్మించినా , , దానికి తాత్కాలికం అని పేరు పెట్టడంతో అది కూడా చంద్రబాబు ఖాతాలోకి రాలేదు. 2019 లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి . .. అమరావతిపై కక్ష కట్టారు . మూడు రాజధానులు ప్రతిపాదన తెరపైకి తెచ్చి . . అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు.
10 నెలల క్రితం అధికారం చేపట్టిన కూటమి సర్కార్ అమరావతిపై ఫోకస్ పెట్టింది. అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దెందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇంతవరకు ఓకే . పనులు కూడా పూర్తి స్థాయిలో మొదలుకాలేదు . గతంలో ఎమ్మెల్యే , ఎంఎల్సీ క్వాటర్స్ నిర్మాణాలు జరిగాయి. మిగిలిన పనులు ఫిబ్రవరి , మార్చి నెలల్లో మొదలుపెట్టారు . ఇంకొన్ని పనులు ప్రధాని మోడీ చేతులమీదుగా పునఃప్రారంభించిన తర్వాత చేపట్టనున్నారు .
పెట్టుబడిదారులు , పారిశ్రామికవేత్తలు చంద్రబాబును నమ్మడంలేదు: 2014-2019 మధ్య అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు వ్యవహారశైలి దేశవ్యాప్తంగా అభాసుపాలయ్యేలా నడిచింది. ఇటీవల తానూ మారానని . . మారిన చంద్రబాబును చూస్తారంటూ పదేపదే ప్రకటలు చేస్తూనే ఉన్నారు. వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా ప్రజలను ఏమార్చేందుకు చంద్రబాబు చేస్తున్న జిమ్మిక్కులకు కాలం చెల్లింది … ఇచ్చిన హామీలు సైతం ”తూచ్ ‘ చెప్పే నాయకుడిగా చంద్రబాబుకు పేరుంది. అలాంటి నేత ఇపుడు రెండో దఫా భూ సమీకరణలో భూములు ఇస్తే . . ఆ రైతులకు భరోసా ఏమిటి ? 2029 లో మరోమారు . .. కూటమి సర్కార్ అధికారంలోకి వస్తుందన్న గ్యారెంటీ ఉందా ? రాకపోతే మా పరిస్థితి ఏమిటి ? మేమిచ్చిన భూములలో అభివృద్ధి జరగకపోతే . . మేము ఏమి చేయాలి ? ఆ గ్యారెంటీ చంద్రబాబు ఇస్తారా ? అంటూ రాజధాని ప్రాంత రైతాంగం ప్రశ్నిస్తున్నారు .
రెండేళ్లలో అభివృద్ధి శరవేగంగా చేసి . . ప్రజలను , రాజధాని ప్రాంత వాసులలో నమ్మకం కలిగించడంతోపాటు , బీజేపీ కేంద్ర పెద్దలతో భరోసా ఇప్పించి . . అపుడు భూ సమీకరణకు సన్నాహాలు చేసుకుంటే మంచిది. చంద్రబాబుపై ప్రజలలో నమ్మకం సన్నగిల్లిన ఈ తరుణంలో భూ సమీకరణకు రైతులు ముందుకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు .
అమరావతి ప్రాంతంలో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, రైల్వే లైన్, ఇన్నర్ , అవుటర్ రింగ్ రోడ్లు నిర్మించాల్సి ఉంది.
వెయ్యి ఎకరాలలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా నిర్మించే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాజధాని చుట్టుపక్కల మరో 44,670 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని సీఆర్డీఏ ప్రణాళికలు రుపొంచిందించి.
ప్రస్తుత0 ఉన్న భూముల్లో అభివృద్ధి పనులు శరవేగంగా చేసిన తర్వాత , చేస్తున్న తరుణంలో భూ సమీకరణ అంటే జనం హర్షిస్తారు తప్ప . .. ఆలూ – చూలు – -లేకుండా తగనమ్మ . .. అంటే జనం ఛీ కొట్టే పరిస్థితి తలెత్తుతుందని చంద్రబాబు తెలుసుకుంటే అమరావతి భవిష్యత్తుకు మేలు జరుగుతుంది . లేదంటే అమరావతిని చేతులారా చంద్రబాబే ముంచేసే దుస్థితి ఎదురవుతుంది .
రాజధాని కోసం అవసరాల రీత్యా రెండో విడత భూ సమీకరణ చేస్తున్నామని ముందే సర్కార్ ప్రకటిస్తే బాగుండేది . అలా కాకుండా . . ఈనాడులో రైతులే తమ భూములను సమీకరించాలని ప్రభుత్వానికి విన్నవించినట్లు కధనాలు రాయించడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి . చంద్రబాబు సర్కార్ పై నీలినీడలు అలుముకుంటున్నాయి . తర్వాత ఎలాగూ , ,, సిఆర్డిఏ కమిషనర్ భూ సమీకరణపై ప్రకటన చేశారు . ఈ దొంగాట వల్ల రైతులు , ప్రజలలో అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ”అమరావతిని కొండవీటి వాగు , మద్దూరు వాగు ముంచేస్తాయనుకున్నారు . కానీ వాటి ముంపు సమస్య లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆ వాగులు వల్ల ముంపు ఆపిన చంద్రబాబు నిర్వాకమే అమరావతిని ముంచే పరిస్థితి తలెత్తుతుంది . ..” అని ఓ టీడీపీ ప్రముఖుడు అభిప్రాయపడ్డారు.
రైతుల ప్లాట్స్ అప్పగించాలి . . కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయింది . ఇంకా రైతులకు ఇవ్వాల్సిన రితనబుల్ ప్లాట్స్ అప్పగించలేదు . కనీసం వాటి సరిహద్దులు నిర్ణయించలేదు . ఇలా కాలయాపన చేస్తూ పొతే . . అమరావతి ఇరవై ఏళ్లకు కూడా పూర్తీ కాదు . . ,, – మాగంటి మురళీకృష్ణ . రైతు – తుళ్లూరు .
నవనాగరాలు పూర్తీ చేసి . . తర్వాత విస్తరణకు వెళ్ళాలి . . అమరావతిలో చంద్రబాబు ప్లాన్ చేసిన నవనాగరాల నిర్మాణం పూర్తిచేసిన తర్వాత 44 వేల ఎకరాల విస్తరణకు వెళ్ళాలి . కానీ ఏమీలేకుండానే భూ సమీకరణ అంటూ హంగామా చేయడం చంద్రబాబు విరమించుకోవాలి . – ఎం నాగేంద్ర ప్రసాద్ . – మంగళగిరి
జగన్ మళ్ళీ గెలిస్తే.? ఆంధ్రప్రజల గ్రహపాటు బాగాలేక పొరపాటున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే . .. ఏంటి పరిస్థితి. దీనిపై చంద్రబాబు , ఎలాంటి హామీ ఇస్తారు? మోడీతో హామీ ఇప్పించినా ఇక్కడ రైతులు , ప్రజలు నమ్మే పరిస్థితిలోలేరు. చంద్రబాబు అమరావతితో ఆటలాడకుండా . .. ముందు ఉన్న భూములలో అభివృద్ధి చేసి . . తర్వాత విడతలవారీగా అవసరమైన భూములు సమీకరించుకోవాలి . – జి . సుందరరావు , అమరావతి .