తెలుగు రాష్ట్రాల చరిత్రలో సరికొత్త రికార్డ్
పదవ తరగతి పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. 98 శాతం , 99 శాతం మార్కులు సాధిస్తేనే అత్యంత ఘనతగా చెప్పుకుంటాం . అలాంటిది 600 కి 600 మార్కులు సాధించి కాకినాడ విద్యార్థి అత్యంత అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది . నేహంజని అనే కాకినాడకు చెందిన స్టూడెంట్ కి ఈ ఘనత దక్కింది . ఈ బాలిక కాకినాడ భాష్యం స్కూల్ లో చదువుతోంది.
ఎలమంచిలి చైతన్య స్కూల్లో ఎండ అనితకు 599 – ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్ పావని చంద్రికకు 598 మార్కులు
మరోవైపు ఎలమంచిలి చైతన్య స్కూల్లో చదువుతున్న ఎండ అనిత అనే విద్యార్థిని 599 మార్కులు సాధించింది. పల్నాడు జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి 598 మార్కులు వచ్చాయి. ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్లో చదువుతున్న పావని చంద్రిక ఈ ఘనత సాధించింది.
ఇంతటి ఘనత సాధించిన ఈ చిన్నారులను అభినందించాల్సిందే . అలా అని అందరి పిల్లలూ ఈ మాదిరిగా మార్కులు సాధించాలని ఒత్తిడి చేయడం మాత్రం సరికాదని పేరెంట్స్ గుర్తించుకోవాలి . మార్కులు అవసరమే కానీ , అవి ఒక్కటే కొలమానం కాదని మర్చిపోకూడదు .