Abhi news
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
Abhi news
అభిప్రాయం
Home Uncategorized

ఈడీ అదుపులో బెంగాల్ మంత్రి

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగిస్తున్న టీచ‌ర్స్ రిక్రూట్‌మెంట్ అక్ర‌మాల కేసు

Ram Maddipati by Ram Maddipati
July 23, 2022
in Uncategorized
ఈడీ అదుపులో బెంగాల్ మంత్రి

ఊహించిన‌ట్టుగానే టీచ‌ర్స్ రిక్రూట్‌మెంట్ స్కాంలో బెంగాల్ రాష్ట్ర‌మంత్రి పార్థా ఛ‌ట‌ర్జీని ఈడీ శ‌నివారంనాడు అరెస్టు చేసి రెండు రోజుల‌పాటు క‌స్ట‌డీలోకి తీసుకుంది. అంత‌కుముందు మంత్రికి స‌న్నిహితురాలిగా పేరొందిన అర్పితా ముఖ‌ర్జీ ఇంట్లో జ‌రిపిన సోదాల్లో రూ. 20 కోట్ల న‌గ‌దు ప‌ట్టుబ‌డిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం ఆమెను అదుపులోకి తీసుకున్న ఈడీ తరువాత మంత్రి పార్థా ఛట‌ర్జీని కూడా అరెస్టు చేసింది. సోమ‌వారం మంత్రిని కోర్టులో హాజ‌రుప‌ర‌చి ఆయ‌న‌ను విచారించేందుకు 14 రోజుల పాటు త‌మ క‌స్ట‌డీకి అప్ప‌గించాల‌ని ఈడీ అధికారులు కోరే అవ‌కాశ‌మున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ స్కాంతో సంబంధ‌ముంద‌ని భావిస్తున్న మ‌రికొంద‌రి నివాసాల్లోనూ కార్యాల‌యాల్లోనూ ఈడీ సోదాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈడీ కస్టడీలో ఉన్న ఆయనను కోల్‌కతా లోనిఎస్‌ఎస్‌కేఎమ్ హాస్పిటల్‌కు వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. నక్తాలాలోని ఛటర్జీ నివాసంలో ఈ కేసుకు సంబంధించిన ప‌లు ప‌త్రాల‌ను ఇప్పటికే ఈడీ స్వాధీనం చేసుకుంది. త‌న నివాసంలో భారీగా నోట్ల క‌ట్ట‌ల‌తో ఈడీకి దొరికిన‌ మంత్రి స‌హాయ‌కురాలైన అర్పితా ముఖ‌ర్జీ గ‌తంలో ప‌లు బెంగాలీ చిత్రాలతోపాటు, ఒడియా, త‌మిళ చిత్రాల్లోనూ న‌టించింది. కోల్‌క‌తా న‌గ‌రంలో భారీస్థాయిలో నిర్వ‌హించే దుర్గాపూజ‌ల క‌మిటీ ప్ర‌చార‌క‌ర్త‌గా ఉన్న స‌మ‌యంలో ఆమెకు మంత్రితో ప‌రిచ‌య‌మేర్ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

ఈ కేసులో ముందుముందు ఎలాంటి ప‌రిణామాలు ఉండ‌బోతున్నాయో.. మ‌రెంత‌మంది అరెస్ట‌వుతారోన‌ని దేశ‌వ్యాప్తంగా ఉత్కంఠ నెల‌కొంది. కాగా తాజా ప‌రిణామాల‌పై టీఎంసీ నేత‌లు బీజేపీపై తీవ్ర ఆరోపణలు, విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హరిస్తోంద‌ని, ఈడీని బీజేపీ న‌డిపిస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంద‌ని బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ ఆరోపించారు. దేశం ఇప్పుడు బీజేపీ పాలిత‌, బీజేపీయేత‌ర పార్టీల పాలిత రాష్ట్రాలుగా చీలిపోయిన‌ట్టుగా క‌నిపిస్తోంద‌ని ప్రముఖ జర్నలిస్ట్ సాగరిక ఘోష్ విమ‌ర్శించారు.

ShareSendShareTweet
Previous Post

మంకీ పాక్స్ వ్యాప్తిని అడ్డుకోవాల్సిందే

Next Post

జగన్.. ఒక్క ఛాన్స్ అయిపొయింది: ఆంధ్రజ్యోతి ఆర్కే తేల్చిపడేశారు

Related Posts

Uncategorized

ఎయిర్ కార్గోలోనూ జోష్

September 22, 2022
ప్రపంచ కుబేరుల్లో 3 వ స్థానంలో అదానీ, అంబానీ పొజిషన్ ఏంటి?
Uncategorized

ప్రపంచ కుబేరుల్లో 3 వ స్థానంలో అదానీ, అంబానీ పొజిషన్ ఏంటి?

August 30, 2022
Uncategorized

నగ్న వీడియోపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్

August 11, 2022
Next Post
జగన్.. ఒక్క ఛాన్స్ అయిపొయింది: ఆంధ్రజ్యోతి ఆర్కే తేల్చిపడేశారు

జగన్.. ఒక్క ఛాన్స్ అయిపొయింది: ఆంధ్రజ్యోతి ఆర్కే తేల్చిపడేశారు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

You May Like

No Content Available
Facebook Twitter Youtube

ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.

Read More

Categories

  • For U
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • అభిప్రాయం
  • ఆధ్యాత్మికం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • జనరల్
  • జాతీయం
  • టూరిజం
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • సోషల్ మీడియా

Pages

  • Contact
  • ఇ-పేపర్
  • Privacy Policy
  • Disclaimer

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved

No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved