సీనియర్ నటుడు నరేశ్ వ్యవహారం ఇటీవల ముదిరి పాకాన పడింది. నరేశ్, పవిత్రా లోకేశ్ పై మీడియాలో రచ్చ రంబోలా అవుతోంది. సోషల్ మీడియా అయితే కోడై .. కాదు కాదు .. అంతకన్నా ఎక్కువగానే కూస్తోంది. వారి సంబంధంపై అనేక కథనాలు వస్తున్నాయి. దానికి తోడు నరేశ్ భార్య రమ్మ రంగంలోకి దిగి రచ్చ రేటును ఇంకొంచెం పెంచేసింది. నరేశ్, పవిత్ర లోకేశ్ మైసూర్ లోని ఒక హోటల్ గదిలో ఉండగా మీడియాలో వచ్చింది. అంతే కాదు పవిత్రను చెప్పుతో కొట్టడానికి కూడా రమ్య ప్రయత్నించింది.
ఇది కూడా మీడియాలో ప్రముఖంగా ప్రసారమైంది. రమ్యకు వేరే వారితో అక్రమ సంబంధం ఉందంటూ నరేశ్ హేళన చేసిన దృశ్యాలుకూడా కనిపించాయి. ఈ క్రమంలో పవిత్ర లోకేశ్ పోలీసులను ఆశ్రయించారు. తన పరువుప్రతిష్ఠలకు భంగం కలిగేలా మీడియాలో కథనాలు వస్తున్నాయని, కొందరు మీడియా ప్రతినిధులు తనను వెంబడిస్తున్నారంటూ మైసూరు వీవీపురం పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.