“పాత మిత్రులను కలుసుకోవడం ఎవరికైనా ప్రత్యేకమే. విజ్ఞాన్ లో నాతో పాటు చదివిన 91-93 బ్యాచ్ మేట్స్ తో సమావేశం ఎంతో సంతోషం కలిగించింది. మా బ్యాచ్వా ళ్లలో చాలామంది డాక్టర్లే ఉన్నారు. 28 ఏళ్ల తర్వాత కలిశాం… ఒకసారి వెనక్కి చూసుకుంటే., కాలం ఎంత వేగంగా గడచిపోయిందో అనిపిస్తోంది. కానీ, ఇప్పుడు మళ్లీ కలిసిన తర్వాత, కొన్నివారాల కిందటే విజ్ఞాన్ వడ్లమూడి క్యాంపస్ లో కలిసి చదువుకున్నట్టే అనిపిస్తోంది” అంటూ కేటీఆర్ తన మనోభావాలను పంచుకున్నారు. ఈ సందర్బంగా తన మిత్రులతో కలిసి ఉన్న ఫొటోను కూడా ట్వీట్ చేశారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఏపీ సమయంలో ఇంటర్మీడియట్ విద్యను విజ్ఞాన్ సంస్థల్లో చదివారు. అప్పట్లో తనతో కలిసి విజ్ఞాన్ లో చదివిన క్లాస్ మేట్స్ ను కేటీఆర్ మళ్లీ ఇన్నాళ్లకు కలిశారు. దీనిపై తన మనోభావాలతో కూడిన ట్వీట్ చేశారు.