విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లలో బొగ్గుకు బదులుగా వెదురు వినియోగిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వెదురు.. త్వరగా పెరిగే మొక్క. నాలుగైదేళ్లకే కోతకు వస్తుంది. ఎటువంటి నెలలలోనైనా పెరుగుతుంది. వెదురు నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తే..? దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ఉద్యానశాఖ ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్టునే చేపట్టింది. నిర్మల్ జిల్లా భైంసాలో 15 ఎకరాల్లో 2019 నుంచే విద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన’ భీమా బ్యాంబూ’ రకం వెదురు చెట్లను పెంచుతున్నది. ఏపుగా పెరిగిన వెదురు కర్రల నుంచి ప్రత్యేక యంత్రాల ద్వారా ఇప్పటికే వెదురు పెల్లెట్స్ను సక్సెస్వి ఫుల్ గా తయారుచేసారు. త్వరలోనే జాతీయ థర్మల్ విద్యుత్తు కేంద్రంలో బొగ్గుకు బదులుగా ఈ పెల్లెట్స్ను ప్రయోగాత్మకంగా వినియోగించనున్నారు. ఇప్పటికే చైనా, జర్మనీ, అమెరికా వంటి అనేక దేశాల్లో వెదురు పెల్లెట్స్తో థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. మన దేశంలో కూడా థర్మల్ విద్యుత్తు ఉత్పత్తిలో వెదురు పెల్లెట్స్ను 7% తప్పనిసరిగా వినియోగించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ లెక్కన తెలంగాణలో ఉత్పత్తి చేస్తున్న థర్మల్ విద్యుత్తుకు ఏటా 67 లక్షల టన్నుల పెల్లెట్స్ అవసరమని అధికారుల అంచనా. ఇంత భారీ మొత్తంలో డిమాండ్ ఉండటంతో దాదాపు 2.80 లక్షల ఎకరాల్లో వెదురు సాగును ప్రోత్సహించాలని ఉద్యానశాఖ ప్రణాళికలు రూపొందించింది.
- వెదురు సాగుతో రైతులకు భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉన్నది.
- తయారీకి అవసరమైన వెదురు రెండేళ్లకే చేతికి వస్తుంది.
- ఎకరానికి 30 టన్నుల వెదురు ఉత్పత్తి అవుతుంది. దాని నుంచి 20 టన్నుల పెల్లెట్స్ తయారు చేయవచ్చు.
- పెల్లెట్స్ తయారీ ద్వారా ఏటా ఎకరాకు రూ.2 లక్షల నికర ఆదాయం లభిస్తుందని ఉద్యానశాఖ అధికారులు చెప్తున్నారు.
- ఈ పంట ఒకసారి వేస్తే 40- 50 సంవత్సరాలు వరకు పెరుగుతూనే ఉంటుంది.
- దీనికి ప్రత్యేకంగా నీళ్లు, ఎరువుల యాజమాన్యం అవసరం లేదు.