పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరిగే అత్యంత కీలక ఘట్టం.. ఏదైనా గ్రహపాటు బాగాలేకపోతే రెండో మేరేజ్ వరకు ఇటీవల సాధారమైంది. . కానీ ఓ వ్యక్తి ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకున్నాడు.. ఒకరికి తెలియకుండా ఒకరితో కాపురం చేశాడు.. ఈ ఘటన హైదరాబాద్ లోని కొండాపూర్ ప్రాంతంలో బయట పడింది. గుంటూరు జిల్లా బేతంపూడికి చెందిన అడపా శివ శంకర్ బాబు మ్యాట్రీమోనీ ద్వారా పలువురు యువతలను పరిచయం చేసుకున్నాడు. పెళ్లయి విడాకులు తీసుకున్న యువతులనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అలా ఒకరికి తెలియకుండా ఒకరిని 8 మంది యువతుల ను మనువాడాడు. ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని, తనకు వాళ్లతో ఎక్కువ సేపు గడిపే టైమ్ ఉండదని పెళ్లికి ముందే వారితో చెప్పేవాడు. ఎలాగోలా వారిని పెళ్లి చేసుకున్నాడు.. పెళ్లి అయిన తర్వాత అవసరాల కోసమని వారి వద్ద నుంచి లక్షల రూపాయలు తీసుకొని వెళ్లిపోయాడు.. ఆ మొత్తాన్ని జల్సాల కోసం, మరో మహిళకు ఇవ్వడానికి వాడుతాడు. ఈక్రమంలో మరో పెళ్లి చేసుకోడానికి రెడీ అవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకొని ఒకే కాలనీలో పక్క పక్క వీధుల్లో కాపురం పెడతాడు. ఆఫీస్ షిఫ్ట్ పేరుతో ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరకు వెళ్తాడు. ఇలా కొండాపూర్ లో కాపురం పెట్టిన ఓ మహిళకు అనుమానం వచ్చి నిలదీయడటంతో అసలు విషయం బయటపడింది. ఈనెల 7న అతడు కనిపించకుండాపోయాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు.