ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీజేపీ నేతలు తనపై చేసిన ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణలోని 33 జిల్లాల్లో ఫిర్యాదు చేశారు. తనపై ఆరోపణలు చేసిన ఢిల్లీ బీజేపీ నేతలపై ఆమె ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందర్ సింగ్ పై పరువు నష్టం దావా వేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలపై నిన్న కవిత మీడియా ద్వారా తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపిన విషయం విధితమే. ఇపుడు ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.