క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ కన్నుమూశారు. 46 యేళ్ల సైమండ్స్ ఆస్ట్రేలియా తరపున 26 టెస్టులు, 198 వన్డేలు ఆడిన విషయం తెల్సిందే. గత రాత్రి క్వీన్స్లాండ్ రాష్ట్రంలోని టౌన్స్విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో సైమ్ండ్స్ ఒక్కరే ఉన్నారు. ప్రమాద వార్త తెలుసుకున్న పోలీసులు డ్రైవింగ్ సీట్లో ఉన్న సైమండ్స్ను రక్షించే ప్రయత్నం చేశారు. అయితే, కారు బోల్తా పడటంతో తీవ్రంగా గాయపడి స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తొలుత అతడు సైండ్స్ అని అధికారులు గుర్తించలేకపోయారు. మీడియా సంస్థలే తొలుతు గుర్తించాయి. అతడి మృతివార్త తెలిసిన వెంటనే క్రికెట్ ప్రపంచం నివ్వెర పోయింది. ఆస్ట్రేలియా క్రికెటర్లు షాక్కు గురయ్యారు.
సైమండ్స్ సహచరులైన జాసన్ గిలెస్పీ, ఆడం గిల్క్రిస్ట్, పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తదితరులు ట్వీట్లతో తమ బాధను పంచుకున్నారు. సైమండ్స్ మృతి చెందాడన్న వార్తను నమ్మలేకపోతున్నామని, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.