‘టీనేజర్స్, యువత సోషల్ మీడియా మోజులో పడిపోతున్నారు. మితిమీరిపోతున్నారు. ముక్యంగా ఇంటర్ స్టూడెంట్స్ సోషల్ ఫ్లాట్ ఫామ్స్ ఉచ్చులో పడి విలవిల్లాడుతున్నారని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయ్. సోషల్ మీడియాలో పరిచయాలను గుడ్డిగా నమ్మితే ఏం జరుగుతుందో ఈ ఘటనే ఓ ఉదాహరణ. తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లాకు చెందిన బానోతు సురేష్ అలియాస్ సన్నీ(22) హైదరాబాదులోని జగద్గిరిగుట్టలో నివాసం ఉంటూ స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. అతనికి ఇన్స్టాగ్రామ్లో మూసాపేటకి చెందిన ఓ ఇంటర్ విద్యార్ధినితో పరిచయం ఏర్పడింది. ఇన్స్టాగ్రామ్లో పలుమార్లు ఇద్దరు చాటింగ్ చేసుకున్నారు.. ఈ క్రమంలో గతనెల 20న అమ్మాయి తల్లిదండ్రులు ఊరెళ్లడంతో అతనికి ఫోన్ చేసి ఇంటికి ఆహ్వానించింది ఆ యువతి.. కూల్ డ్రింక్ తీసుకురావడానికి బయటకు వెళుతూ .. అతనిని ఇంట్లోనే కూర్చోమని చెప్పింది. ఇదే అదునుగా భావించిన ఆ యువకుడు ,. ఆ యువతి ఇంట్లో ఉన్న 20 తులాల బంగారు నగలు, రూ.10 వేలను తీసుకుని జేబులో దాచుకున్నాడు. ఆ తర్వాత.. యువతి తెచ్చి ఇచ్చిన డ్రింక్ తాగి.. కాసేపు మాట్లాడి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. అయితే ఈ విషయం ఆ యువతి తల్లిదండ్రులకి తెలియడంతో ఈ నెల 1న కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సురేష్ ని అదుపులోకి తీసుకొని నగలను స్వాధీనం చేసుకున్నారు.