” పదేళ్ల క్రితం వేసవిలో ఓ సారి అడవికి వెళ్లాను. అక్కడ కొన్ని పక్షులు,జంతువులు చనిపోయి కనిపించాయి. నీళ్లు లేక ఇలా జరిగిందని అనిపించింది. నా వంతుగా నీటి తొట్టెలు పెట్టి ఏటా నీళ్లు పోస్తున్నాను. మనమే కాదు.. నోరు లేని ఈ మూగ జీవాలకు దాహం వేస్తుంది కదా.. వాటికీ కాసిన్ని నీళ్లు కావాలి కదా..” అంటారు రమణారావు. ఏడు పదుల వయసులో ఈ పెద్దాయన నల్లమల అడవిలో పక్షులు, జంతువుల కోసం ఏటా వేసవిలో ట్రాక్టర్కు తో ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చి.. అక్కడ ఏర్పాటు చేసిన సిమెంట్ తొట్టెలలో పోస్తుంటారు.
గత 10 సంవత్సరాలుగా అడవిలో ఉన్న పక్షులను,జంతువుల ను ఇలా నీళ్లు పోసి కాపాడుతున్నాడు…..
,అడవిలో ఇలా 100 వరకు నీటి తొట్టెలు తయారు చేయించి,,,వాటిలో ప్రతివేసవిలో నీళ్లు పోస్తుంటాడు. ఈ అడవిలో అక్కడక్కడా ఉన్నాయి తొట్టెలు.. ఉదయం సాయంత్రం వివిధ రకాల పక్షులు,జంతువులు వీటిని త్రాగి బతగ్గలుగుతున్నాయ్ ….పక్షులకు నీళ్లు పోయడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్తారు. ..ఇలాంటి గొప్ప వ్యక్తులు ప్రపంచానికి తెలియకపోయిన పర్వాలేదు కానీ,, వారి స్ఫూర్తి తో మనము మన పరిసరాలలో పక్షులకు , జంతువులకు కాసిన్ని నీళ్లు పెడితే… అది కూడా ఈ రెండు, మూడు నెలలు.
ఆ పెద్దాయనంత పెద్ద మనసు అక్కర్లేదు.. వంద కుండీలు పెట్టక్కర్లేదు.. కనీసం చిన్న మట్టి పిడతలతో, సిమెంట్ కుండీలతో మన పరిసరాలలో కాసిన్ని నీళ్లు పోసి మన తోటి ప్రాణులను దాహార్తి నుంచి కాపాడదామా.. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హల్వై చల్ర చేస్తోంది. వైరల్ చేయడమే కాదు.. మనం కాసిన్ని నీళ్లు పెట్టిన తర్వాత వేరే వారికి ఫార్వార్డ్ చేస్తే బాగుంటుంది కదా.