జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారం భూమ్ రాంగ్ అయిందా? చంద్రబాబు నాయుడుపై ఆ మచ్చ వేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన జగన్ మెడకే ఇపుడు చుట్టుకోబోతోందా? కడప ఎంపీ, జగన్ కజిన్ వైఎస్ అవినాష్ రెడ్డి ని సీబీఐ విచారించిన తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయి.
వివేకా హత్య వ్యవహారం.. ముందు నుంచీ జగన్ అండ్ కో పై అనుమానాలు బలంగానే తలెత్తాయి. మర్డర్ జరిగిన మరుసటి రోజు జగన్ తన సాక్షి పత్రికలో ”నారా సుర రక్త చరిత్ర’ శీర్షికన భారీ కధనం వేయించారు. అప్పట్లో జగన్ కి ఇది రాజకీయంగా బలంగా ఉపయోగపడింది. చంద్రబాబును అనుమానించకపోయినా జగన్ అండ్ కో పై మచ్చ పడకుండా కొంత వరకు సబ్జెక్టు ని డైవర్ట్ చేయగలిగామని వాళ్లంతా భ్రమపడ్డారు. ఇపుడు ఆ భ్రమలన్నీ తొలగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ ఇదే అంశంపై ”జగణాసుర రక్త చరిత్ర’ పేరుతో పుస్తకం వేసి మరీ ప్రచారం చేస్తున్నారు. అప్పట్లో జగన్ కి ఎంత ప్లస్ అయిందో..ఇపుడు రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. ఇది క్రమంగా జగన్ మోహన్ రెడ్డి కి కరుణుడు శాపాలమాదిరి వెంటాడే పరిస్థితులు కనిపిస్తున్నాయ్.