“జగన్ పాలనపై జనం అసహ్యించుకుంటున్నారు. అభివృద్ధి అనేది ఏపీలో ఎక్కడా కానరావడంలేదు. ఇసుక, గనులు, మద్యం దోపిడీతో భారీ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఓ పక్క రోడ్లు దారుణంగా ఉన్నాయ్… ఇవన్నీ జనం గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అది మనకు ప్లస్ అవుతుంది..” ఇదీ తెలుగుదేశం పార్టీ అధినేతలతో ఉన్న భావన. ‘అవతలివాడు చేతగాని వాడైతే అది మనకు ఉపయోగపడుతుందన్న కాన్సప్ట్’.
టీడీపీ మేధావులు, కీలక నేతలు భావిస్తున్నట్లు జగన్ పాలనపై రాష్ట్రంలో వ్యతిరేఖత నిజమే కావచ్చు. అయితే అది వైసీపీని గద్దె దించేటంత వ్యతిరేఖత కాకపోవచ్చు. జగన్ పైనా, వైసీపీ నేతల చేష్టలపైనా, పోలీస్ అరాచకాలపైనా సఫరర్స్ లో ఆగ్రహావేశాలు ఉంటాయి తప్ప సామాన్య జనంలో ఇవి పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో లేదనే చెప్పాలి. ఇది ముమ్మాటికీ జగన్ కి బెన్ ఫిట్ చేసే అంశమే. ప్రజల్లో వ్యక్తిగత స్వార్థం పీక్ స్టేజ్ లో ఉంది. సామాజిక బాధ్యత ఎవరికోగానీ పట్టదు. ఇలాంటి పరిస్థితులలో జగన్ ని తిప్పి కొడతారని టీడీపీ నేతలు భావన కరెక్ట్ కాదేమో.
ఇదే సమయంలో టీడీపీ పట్ల జనంలో ఆదరణ పెరుగుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయ్. నిజమే. అయితే దాన్ని వడిసి పట్టుకునే యంత్రాంగం ప్రస్తుతం టీడీపీ కి లేదనే చెప్పాలి. మంగళగిరిలో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చే కార్యకర్తలు సంఖ్య గణనీయంగా పెరుగుతొంది. చంద్రబాబు., లోకేష్ కార్యాలయంలో ఉన్నపుడు వారిని కలవడానికి వచ్చే కేడర్ .. టీడీపీ అధికారంలో ఉన్నపుడు కూడా లేనంత భారీగా ఉంటోంది. ఇది పార్టీ బలోపేతం అవుతుందనడానికి సంకేతమే కావచ్చు. కానీ, పార్టీ ఆఫీస్ లోను కేడర్ ని డీల్ చేసే యంత్రాంగం సక్రమంగా పని చేయడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వృద్ధ నేతలతోనే,
ఎన్టీఆర్ నుంచి టీడీపీ చంద్రబాబు చేతికి వచ్చిన తర్వాత పార్టీలో సమర్థులైన యూత్ లీడర్స్ రిక్రూట్ మెంట్ జరగలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ తెచ్చి పెట్టిన యువత ఇపుడు వృద్ధాప్యంలో ఉన్నారు. వారిలో చాలా మంది (యనమల రామకృష్ణుడు, బుచ్చయ్య చౌదరి, చిక్కాల రామచంద్రరావు, లాంటివారు..) శ్రీకాకుళం ఎంపీ రాంమోహన్ నాయుడు వంటి సమర్ధవంతమైన యువ నేతల కొరత టీడీపీ ని వేధిస్తోంది. ఈ లోటును పార్టీ గుర్తించినా ఇప్పటికీ నిర్లక్ష్యంగానే ఉన్నారు.
ఇన్ని లోటుపాట్లను పట్టించుకోకుండా ‘సూపర్ గా ఉంది..’ అన్న భ్రమల్లో ఉంటే ఎవరూ కాపాడలేరు. జగన్ పట్ల ఎంత వ్యతిరేఖత ఉన్నా, సంక్షేమం పేరుతొ జనానికి ఊరికే డబ్బు పంచుతున్నారు. ఇది పేద ప్రజల్లో బలమైన ప్రభావం చూపుతుంది. గవర్నమెంట్ ఆస్తులు అమ్మెస్తున్నా, రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్న జనానికి పెద్దగా పట్టదు. ఎవరికీ వారికీ వ్యక్తిగత ప్రయోజనమే ముఖ్యం.. అని భావించే జనం ఎక్కువగా ఉన్నంతవరకు ఇలాగే ఉంటుంది. ఈ విషయాన్నీ టీడీపీ పెద్దలు గమనిస్తే మంచిది.