”రాజకీయాలలో సొంత వ్యూహాలతోపాటు ప్రత్యర్థి పై ఎత్తులు కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. కొన్నిసార్లు వైరి పక్షం ట్రాప్ లో పడుతూ ఉంటారు. పవన్ కల్యాణ్ విషయం ఇదే జరిగినట్లు కనిపిస్తోంది. విశాఖలో ‘పోరుబాట’ పేరుతో జనసేనాని తలపెట్టిన కార్యక్రమాన్ని జగన్ సర్కారు భారీ పోలీసు బలగాలను దించి అడ్డుకున్నారు. ఇలా చేస్తే పవన్ అండ్ కో రెచ్చిలోపోతారని ముందే ఓ అంచనాకు వచ్చి ఉంటారు వైసీపీ వ్యూహకర్తలు . సరిగ్గా ఇదే జరిగింది. ”
వైసీపీ నేతల్ని, మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు పవన్. తమ అధినేత రేచిపోవడంతో జన సైనికులు సైతం రోడ్డెక్కి తేల్చుకుందాం.. రండి..అంటూ వైసీపీ వాళ్లకు సవాళ్లు విసిరారు. ఆ సమయంలో ఈ వ్యవహారాలు మీడియా ద్వారా వీక్షించిన వారిలో చాలామంది.. వైసీపీ మంత్రులు, నేతలు పవన్, జన సైనికులు దెబ్బకు వెనుకడుగు వేస్తారని భావించారు. అయితే వైసీపీ వాళ్ళు అస్సలు తగ్గలేదు సరి కదా.. ఏ మాత్రం వెనుకంజ వేయకుండా పోటీపడి మరీ వాళ్ళ సంప్రదాయ భాష ఉపయోగించారు.
ఇంకాస్త సమయం వెయిట్ చేయాల్సింది.. పోరుబాటను అడ్డుకోవడం ద్వారా పవన్ కల్యాణకు ఇబ్బందులు కలిగించారు వైసీపీ నేతలు. జన సైనికులను అరెస్టులు చేసారు. జగన్ ప్రభుత్వ అణచివేతపై పవన్ కు సానుభూతి తెలిపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నోవాటెల్ హోటల్ కి వెళ్లి పవన్ ను పరామర్శించారు. వీరిద్దరి కలయిక సందర్బంగా ప్రెస్ మీట్ పెట్టడం.. జగన్ సర్కారుపై విమర్సలు చేయడం మాములే. అయితే టీడీపీ-జనసేన పొత్తుపై కూడా పాజిటివ్ సంకేతాలు ఇచ్చారు. అయితే ఇది ప్రత్యర్థి జగన్ కే రాజకీయంగా ఎంతోకొంత మేలు చేసే వ్యవహారంలా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్, జన సైనికులు హడావుడితో టీడీపీ కి కాస్తో..కూస్తో ఇపుడిపుడే దగ్గరవుతున్న బీసీ సామజిక వర్గాల వారు .. మళ్ళీ వైసీపీ కి మద్దతు తెలుపే అవకాశాలు లేకపోలేదన్న చర్చ నడుస్తోంది. గోదావరి జిల్లాలతోపాటు.. కోస్తాలో చాలాచోట్ల కాపు సామాజిక వర్గానికి బీసీలు వ్యతిరేఖంగా ఉంటూ వస్తున్నారు. ఇలాంటి సందర్బాలలో వైసీపీ వ్యూహకర్తలు దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు మరింత ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. అదే ఇంకో ఏడాది ఆగిన తర్వాత… ‘వైసీపీ, జగన్ అరాచకాలు అడ్డుకోవాలంటే చంద్రబాబుతో కలవక తప్పడంలేదు. రాష్ట్ర బాగు కోరేవారంతా మాకు అండగా నిలవాలి..’ అని పవన్ ఒక్క పిలుపు ఇస్తే.. సమీకరణాల్లో కొంత సానుకూలత లభించేది. పొత్తుపై ఇపుడే క్లారిటీ ఇవ్వడం.. అదీ ఉద్యేగపూరిత సందర్భంలో ఇలా చేయడం టూ ఎర్లీ అంటున్నారు రాజకీయ మేధావులు.