ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సొంత జాగీరులా భావిస్తూ ., ఆర్ధిక అరాచకత్వానికి పాల్పడుతున్నా.. జనంలో దీనిపై పెద్దగా స్పందన ఉందనుకోలేం. ‘ఏదో స్కీం పేరుతొ డబ్బు వేస్తున్నంత సేపు మెజార్టీ ప్రజలకు రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదు. ఏపీలో మీడియా, ఓటర్లను కులాలు, మతాలు , ప్రాంతాలు, వర్గాలు వారీగా విడగొట్టడంలో వైసీపీ అధినేత జగన్ కృతకుచులయ్యారు. ఇది రాబోయే తరాలకు తీవ్ర నష్టం చేకూర్చే అంశమే. అయినా ఎవరికీ పట్టదు.
మీడియాపై నమ్మకం తగ్గింది.. ఏపీలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలూ., ఓ డజను ఛానల్స్ జనం చూసేవి ఉన్నాయి. వీటిలో ఒకటి, రెండు మినహా మిగిలినవి జగన్ కె అనుకూలంగా దూకుడు చూపుతుంటాయ్. జగన్ అరాచకాలను సైతం మంచిగా చూపడానికి యత్నిస్తుంటాయ్. వాస్తవాలు రాసిన పత్రికలపైనా జగన్ అండ్ కో సోషల్ మీడియాతో చేస్తున్న దాడి చాలా వరకు సఫలమవుతోంది. దీంతో ఏపీలో మంచి-చెడు అనే విచక్షణ గణనీయంగా తగ్గుతోంది.
ఆర్ధిక అరాచకానికి ఉదాహరణ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని మరోసారి రుజువయింది. అభివృద్ధి విషయంలో జగన్ సర్కారువి ఆర్భాటాలేనని తేలిపోయింది. అసాధారణ రీతిలో రాష్ట్ర రెవెన్యూ లోటు పెరగడమే దీనికి నిదర్శనమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. విచ్చలవిడిగా అప్పులు చేస్తూ, ఆదాయానికి మించి ఖర్చులు చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ కొరవడింది. ఫలితంగానే రాష్ట్ర రెవెన్యూ లోటు గతి తప్పింది. 2022-23 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంచనాలు, వాస్తవిక ఆదాయం, వ్యయాల లెక్కలపై తొలి ఐదు నెలలకు గాను (ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) కాగ్ విడుదల చేసిన వివరాల ప్రకారం… రాష్ట్ర రెవెన్యూ లోటు 217.09 శాతానికి పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ. 17,036.15 కోట్లుగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొనగా… తొలి ఐదు నెలల్లో అది రెట్టింపయి, రూ. 36,983.28 కోట్లకు చేరుకుంది. బడ్జెట్లో ప్రతిపాదించినదాని కంటే ఇది 217.09 శాతం అదనం.. ” ఇలాంటి ఆధారాలతో కాగ్ వంటి సంస్థలు ఎన్ని గణాంకాలు వెల్లడించిన అది సామాన్య జనానికి అర్థంకాదు. అవసరం కూడా ఉండదు.
ఇదే కొనసాగితే.. ఇదే పరిస్థితి ఏపీలో కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్రం అధోగతి పాలవ్వక తప్పదు. ఈ విషయాన్నీ మేధావులు, ఆర్ధిక వేత్తలు, సామాజిక వేత్తలు హెచ్చరిస్తున్నా జనంలో మాత్రం రావలసినంత అవగాహన రావడంలేదు. ఉద్యమ స్ఫూర్తి అనేది చెప్పుకోవడం దండగ. ఇసుక,, మద్యం, గనుల అక్రమ ఆదాయాలతో ఓటర్లకు భారీ ప్యాకేజీలు ఇస్తారన్న భ్రమలలోనే మెజార్టీ జనం ఉన్నారు. ఇలా జనంలో మార్పు రానంతకాల0 .. జగనే కాదు.. అలాంటి నేతల అరాచకాలకు అంతే ఉండదు. ప్రతిపక్షాలు బలంగా లేకపోతే ఇలాంటి అరాచకాలకు అధికార పార్టీ బరితెగిస్తుంది. ఇది ప్రజా స్వామ్యానికి పెను ప్రమాదం తెచ్చిపెడుతుంది. ‘ఏమైతే మనకెందుకులే.. మనకు రావలసిన సొమ్ములు వస్తున్నాయ్. భవిష్యత్తు గాడిద గుడ్డు.. అలా చెప్తారు.. ఏమవుతుందిలే.. అన్న ఉదాసీనత వీడకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు.