బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య విషయం జగన్మోహన్ రెడ్డి దంపతులకు ముందుగానే తెలుసని చెప్పడానికి ప్రాథమిక ఆధారాలు లభిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. . వివేకా హత్య 2019 మార్చి 15 అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో జరిగింది. అదేరోజు తెల్లవారుజామున 4.30 గంటలకు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోటస్ పాండ్లోని తన నివాసంలో నలుగురి ముక్యులతో సమావేశం నిర్వహించారట. ఇది ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమం. తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ఆ నలుగురితో జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఇంతలోనే లోటస్ పాండ్ లో మేడ మీద నుంచి పిలుపు వచ్చింది. వెంటనే ఇంట్లోకి వెళ్లిన జగన్ పది నిమిషాల తర్వాత తిరిగి కిందకి వచ్చారు. చిన్నాన్న గుండెపోటుతో చనిపోయారని ఆ నలుగురికీ చెప్పి సమావేశాన్ని కొనసాగించినట్లు చెపుతున్నారు. అంటే, వివేకా హత్య గురించి ప్రపంచానికి తెలియక ముందే జగన్మోహన్ రెడ్డి-భారతి దంపతులకు తెలుసుననిఅనుమానాలు బలపడుతున్నాయి. హత్య తర్వాత అవినాశ్ రెడ్డి ఫోన్ నుంచి జగన్ దంపతుల వ్యక్తిగత కార్యదర్శులకు ఫోన్లు వెళ్లాయని సీబీఐ విచారణలో కూడా వెల్లడైన విషయం విదితమే. ఆ నలుగురూ మరెవరో కాదు! ప్రస్తుత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ పర్సనల్ సెక్రటరీ కృష్ణమోహన్ రెడ్డి, దివంగత సోమయాజులు కుమారుడు కృష్ణ (అధికారంలోకి వచ్చాక ఆయనను ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించారు), రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం. సీబీఐ అధికారులు ఈ నలుగురినీ విచారిస్తే అసలేం జరిగిందో బయటికొస్తుంది. వివేకా హత్య వెనుక విస్తృత స్థాయి కుట్ర ఉందని సీబీఐ మొదటి నుంచీ చెబుతోంది. ఇప్పుడు అది నిజమేనని నమ్మక తప్పని పరిస్థితి.
చిన్నాన్న వివేకాది సహజ మరణమే అయినప్పటికీ భౌతికకాయానికి నివాళులర్పించడానికి జగన్ స్థానంలో ఎవరున్నా ఉన్నపళంగా బయలుదేరి వెళతారు. జగన్ దంపతులు అలా చేయకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. జగన్తో ఆ రోజు సమావేశమైన ఆ నలుగురూ ఇప్పటికీ ఆయనతోనే ఉన్నారు. హైదరాబాద్ నుంచి పులివెందుల కారులో వెళ్లారు. తర్వాత ఆ డ్రైవర్ ఆచూకీ పై అనుమానాలు ఉన్నాయి. వీటన్నింటినీ లోతుగా పరిశీలిస్తే జగన్-భారతిలపై కూడా వివేకా హత్య గురించి ముందే తెలిసినా ఎందుకు మౌనంగా ఉన్నారో వారి అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాలి.