బెంగళూరులో నీటి చుక్క కోసం ప్రజలు నానాఅవస్థ పడుతున్నారు. తక్కువ నీటితో తమ అవసరాలు తీర్చుకోవడానికి రీసైక్లింగ్ పద్ధతులను అవలంబిస్తున్నారు. కొన్ని ప్రాంతాల రోజువారీ సరఫరా కోసం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. నెలకు కేవలం 5 రోజులే స్నానం చేయాల్సిన పరిస్తితులు ఏర్పడ్డాయి.
మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.. అని ఓ నివాసి ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంకర్ వాటర్ రేట్లను నిర్ణయించాలని నగర పాలక సంస్థ ఆదేశించడం వల్ల ప్రయోజనం కలిగిందా అని ప్రశ్నించగా అధిక డిమాండ్ కారణంగా సకాలంలో ట్యాంకర్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో, ఎప్పుడు సాధారణ జీవితానికి తిరిగి వస్తుందో తెలియదు.. 15 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాను భూగర్భ జలాలపై చర్యలను ఏ ప్రభుత్వమూ చేయలేదని చాలా మంది చెపుతున్నారు. తాగునీటి కోసం ప్రజలు కిలోమీటర్ల పొడవునా క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారన్నారు.