- రైలు ప్రమాదానికి సిగ్నల్ ఫెయిల్యూరే కారణం
- ఒడిశారైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 300కు పెరిగే ఛాన్స్
- చనిపోయిన వారిలో ఎక్కువ మంది తెలుగు ప్రయాణికులు
- వెయ్యి మందికి పైగా ప్రయాణికులకు గాయాలు
- 2 రైళ్లలో తెలుగువాళ్లు 200 మంది ఉండొచ్చని అంచనా
- ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
- కాకినాడ జిల్లా వాసులు ఎవరైనా ఈ రైలులో ప్రయాణించి ఉండి, అక్కడ ఏదైనా సహకారం అవసరమైతే హెల్ప్ డెస్క్ను సంప్రదించాలని పిలుపు
- సంప్రదించవలసిన హెల్ప్ లైన్ నెంబర్స్ :
- పోలీస్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ -9490618506
-
పోలీస్ కంట్రోల్ రూమ్ -9494933233
- ఒడిశా (Odisha)లో జరిగిన ఘోర రైలు ప్రమాదం (Train Accident)లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కోరమండల్ ఎక్స్ప్రెస్లో బెంగాల్ ప్రయాణికులు ఎక్కువ మంది ఉన్నారు. తెలుగు వారు 150 మందిపైనే ఉండొచ్చు అంటున్నారు. ఐతే.. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది ఎన్నో సందేహాలకు తావిస్తోంది. రైల్వే అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం అనే వాదన తెరపైకి వస్తోంది.
దీనిపై రైల్వే అధికారులు మరో రకమైన ప్రకటన ఇస్తున్నారు. కోరమండల్ రైలు బోగీలు పట్టాలు తప్పిన తర్వాత… ఆ బోగీలను… యశ్వంత్పూర్- హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్.. ఢీకొట్టినట్లు రైల్వే శాఖ ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. ఈ ప్రమాదంలో 4 బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది.
ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం అత్యున్నత సమావేశం నిర్వహించారు.