మాజీ మంత్రి, ఏపీ ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు ఎందుకు ఆలస్యం అవుతుందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు జాప్యం చేస్తే వేరే అధికారిని ఎందుకు నియమించకూడదని ప్రశ్నించింది. కేసు విచారణ ఎంత వరకు వచ్చిందనే అంశం చెప్పాలని , ఇప్పటి వరకు జరిగిన విచారణ నివేదిక సీల్డ్ కవర్ లో అందచేయాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేసించింది. సీబీఐ డైరెక్టర్ అభిప్రాయం అడిగి చెప్పాలని న్యాయవాది నటరాజన్ని ఆదేశించింది.