రాష్ట్రపతి .. దేశానికి మొదటి వ్యక్తి. ప్రజాస్వామ్య దేశంలో అత్యంత కీలకమైన పదవి. వీరి నివాసం చాలా ప్రత్యేకతలతో కూడి ఉంటుంది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ భవనం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. భారత మొఘల్ బౌద్ధ సాంప్రదాయ నిర్మాణశైలితో విశాలమైన గదులు ఆహ్లాదకర ఉద్యానవనాలు పచ్చిక బయళ్లు ఫౌంటెయిన్లతో ఎన్నో విశేషాలకు రాష్ట్రపతి భవన్ నెలవుగా ఉంటుంది.
ప్రపంచ దేశాల అధ్యక్ష నివాసాలతో పోలిస్తే ఎందుకు ప్రత్యేకం ? అనే విషయాలు ఆసక్తికరం. దేశంలోని అద్భుతమైన కట్టడాల్లో రాష్ట్రపతి భవన్ ఒకటి. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ భవనం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. భారత, మొఘల్, బౌద్ధ సాంప్రదాయ నిర్మాణశైలితో, విశాలమైన గదులు, ఆహ్లాదకర ఉద్యానవనాలు, పచ్చిక బయళ్లు, ఫౌంటెయిన్లతో ఎన్నో విశేషాలకు రాష్ట్రపతి భవన్ పెట్టింది పేరు. 1912 నుంచి 1929 మధ్యకాలంలో రాష్ట్రపతి భవన్ నిర్మించారు. అంటే దాదాపు 17ఏళ్ల పాటు నిర్మాణం సాగింది. దీనికోసం అప్పట్లోనే కోటీ 40లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు టాక్. ఇందులో మొదట లార్డ్ ఎర్విన్ వైస్రాయ్ కుటుంబం నివసించారు. స్వాతంత్ర్యం తర్వాత 1950లో ఈ భవనాన్ని రాష్ట్రపతి భవన్గా మార్చారు.
రాష్ట్రపతి భవన్ . న్యూ ఢిల్లీలో ఉన్న భారత రాష్ట్రపతి అధికారిక నివాసం. ఇది భారతదేశంలోని ప్రసిద్ధ స్మారక కట్టడాలలో ఒకటి. ఇందులో ఉద్యానవనాలు మ్యూజియం సెరిమోనియల్ హాల్ భారీ సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుగా హాళ్లు భారీ హంగులతో ఉంటాయి. అలాగే ఇది విస్తీర్ణం పరంగా దేశంలోనే అతిపెద్ద దేశాధినేత నివాసం కావడం విశేషం.జూలై 25న సోమవారం భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇక నుంచి ఆమె ఉండబోయే రాష్ట్రపతి భవన్ గురించి దేశ ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి భవన్ విశేషాలను తెలుసుకోవడానికి అంతా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.
17 ఏళ్ళు సాగిన నిర్మాణం:
1912 నుంచి 1929 మధ్యకాలంలో రాష్ట్రపతి భవన్ నిర్మించారు. అంటే దాదాపు 17ఏళ్ల పాటు నిర్మాణం సాగింది. దీనికోసం ఇందులో మొదట లార్డ్ ఎర్విన్ వైస్రాయ్ కుటుంబం నివసించారు. స్వాతంత్య్రం తర్వాత 1950లో ఈ భవనాన్ని రాష్ట్రపతి భవన్ గా మార్పు చేసారు.
70 కోట్ల ఇటుకలు
ఈ నాలుగు అంతస్థుల భవనంలో.. మొత్తం 340 గదులు ఉన్నాయ్. భవనం మొత్తం విస్తీర్ణం 2 లక్షల చదరపు అడుగులు. కారిడార్ల పొడవే రెండున్నర కిలోమీటర్లు. బిల్డింగ్ నిర్మాణం కోసం 70 కోట్ల ఇటుకలు ఉపయోగించారు. 30 లక్షల క్యూబిక్ ఫీట్ల రాళ్లు ఇనుముతో మొత్తం 23 వేల మందికి పైగా కార్మికులు భవన నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. ఈ భవంతి నిర్మాణానికి సర్ ఎడ్విన్ లూటెన్స్ హెబెర్ట్ బకెర్ ఆర్కిటెక్ట్లుగా పనిచేశారు. రాష్ట్రపతి భవన్లో మొత్తం 64 లివింగ్ రూమ్స్ ఉన్నాయ్. మార్బల్ హాల్ కిచెన్ మ్యూజియం చిల్డ్రెన్ గ్యాలరీ గిఫ్ట్ మ్యూజియం దర్బార్ హాల్ లైబ్రరీ అశోక హాల్ మొఘల్ గార్డెన్లు ఈ భవనం ప్రత్యేకతలు. 330 ఎకరాల్లో ఇంగ్లీష్ అక్షరం H ఆకారంలో రాష్ట్రపతి భవనం నిర్మించారు.