‘ అధికారాన్ని ఉపయోగించుకుని అక్రమాలకు పాల్పడినందున ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం..’
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. గవర్నర్ రమేశ్ బైస్కు ఈమేరకు నివేదిక సమర్పించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడినందున ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సూచించింది కేంద్ర ఎన్నికల సంఘం.
ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్.. మైనింగ్ లీజును తనకు తానే కేటాయించుకున్నారని, ఇది అధికార దుర్వినియోగమేనని ఆరోపిస్తూ భాజపా ఫిర్యాదు చేసింది. దీనిపై ఈసీ అభిప్రాయం కోరారు గవర్నర్. ఎన్నికల సంఘం నివేదిక ఆధారంగా అతి త్వరలోనే ముఖ్యమంత్రిపై గవర్నర్ చర్యలు తీసుకునే అవకాశముంది.