‘భారత దేశానికి వ్యతిరేకంగా సమాచారాన్ని వ్యాప్తి చేసున్న కారణంగా 8 యు ట్యూబ్ ఛానల్స్ పై కేంద్రం నిషేదం ప్రకటించింది..’ యాంటీ ఇండియా కంటెంట్, ఫేక్ కంటెంట్ వ్యాప్తి చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. 8 ఛానెళ్లపై నిషేధం విధించింది. నిషేధానికి గురైన ఛానెళ్లలలో 7 ఇండియన్ ఛానెళ్లు, ఒక పాకిస్తానీ ఛానెల్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ప్రకారం ఈ ఛానెళ్లపై కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ఈ యూట్యూబ్ది ఛానల్స్ దేశంలో మత సామరస్యానికి భంగం కలిగించేలా సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.
నిషేధానికి గురైన ఛానెళ్లు ఇవే..
ఛానల్ పేరు.. సబ్ స్క్రైబర్లు
- లోక్ తండ్ర టీవీ – దీనికి 12.90 లక్షల సబ్ స్క్రైబర్లు ఉన్నారు.
- యు&వీ టీవీ – 10.20 లక్షల సబ్ స్క్రైబర్లు
- ఏఎం రజ్వీ – 95,900 సబ్ స్క్రైబర్లు
- గౌరవ్ శాలి పవన్ మిథిలాంచల్ – 7 లక్షలు
- సీ టాప్5 టీహెచ్ – 33.50 లక్షలు
- సర్కారీ అప్ డేట్ – 80,900
- సబ్ కుచ్ దేఖో – 19..40 లక్షలు
- న్యూస్ కీ దునియా(పాకిస్తానీ ఛానెల్) – 97 వేలు