- 513 కిలోల మెఫెడ్రోన్ పట్టివేత
ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ రాకెట్ను ముంబై పోలీసులు రట్టు చేశారు. రూ.1,026 కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ముంబైలో ఓ డ్రగ్స్ స్మగ్లర్ ను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ఈ సందర్భంగా గుజరాత్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. దీంతో ముంబై పోలీసులు గుజరాత్లోని అంకలేశ్వర్ ప్రాంతానికి వెళ్లారు. ఓ ఫ్యాక్టరీలో మెఫెడ్రోన్ డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఇక్కడి నుంచి ముంబై సహా ఇతర ప్రధాన నగరాలకు సరఫరా చేస్తున్నట్టు వివరాలు సేకరించారు.
ఫ్యాక్టరీలో సోదాలు జరిపి దాదాపు రూ.1,026 కోట్ల విలువైన 513 కిలోల మెఫెడ్రోన్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫ్యాక్టరీ యజమాని గిరిరాజ్ దీక్షిత్ను అరెస్టు చేశారు. ఇతడు ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివాడు. పోలీసులు మాట్లాడుతూ ‘భారీ డ్రగ్స్ రాకెట్ను ఛేదించాం. గుజరాత్ కేంద్రంగా డ్రగ్స్ మాఫియా పనిచేస్తున్నట్టు మాకు మొదటి నుంచి అనుమానం ఉన్నది. ఆ రాష్ట్ర సముద్ర తీర ప్రాంతంలో భారీస్థాయిలో డ్రగ్స్ పట్టుబడుతున్న విషయం తెలిసిందే.