Abhi news
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
Abhi news
అభిప్రాయం
Home జాతీయం

రు 100 కోట్లకు మంత్రి పదవి.. ఆ కేసు ఏమిటి?

మహారాష్ట్ర ఎమ్మెల్యేను చీట్ చేయబోయిన ముఠా అరెస్ట్

V Srinivas by V Srinivas
July 20, 2022
in జాతీయం
రు 100 కోట్లకు మంత్రి పదవి.. ఆ కేసు ఏమిటి?

” మహారాష్ట్ర కొత్త కేబినెట్ లో మంత్రి పదవి ఇప్పిస్తాం. వంద కోట్లు ఇవ్వండి..” అంటూ ఓ ఎమ్మెల్యే ను బురిడీ కొట్టించడానికి ప్రయత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేసారు..”

రూ . 100 కోట్లు చెల్లిస్తే మ‌హారాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రి ప‌ద‌వి ఇప్పిస్తామ‌ని ఓ ఎమ్మెల్యేను మోస‌గించేందుకు ప్ర‌య‌త్నించిన న‌లుగురు స‌భ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మ‌హారాష్ట్ర‌లో నూత‌న ప్ర‌భుత్వం శాఖ‌ల కేటాయింపులో మార్పు చేర్పులు చేప‌ట్ట‌నుంద‌నే ఊహాగానాల నేప‌ధ్యంలో ఈ ఘ‌ట‌న వెలుగుచూసింది. దౌండ్ బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ కుల్ ఫిర్యాదు ఆధారంగా న‌లుగురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు.  జులై 12న రియాజ్ షేక్ నుంచి త‌న‌కు ఫోన్ కాల్ వ‌చ్చింద‌ని, ఓ ఆఫ‌ర్‌పై చ‌ర్చించేందుకు మిమ్మ‌ల్ని క‌ల‌వాల‌ని రియాజ్ కోరాడ‌ని ఎమ్మెల్యే రాహుల్ కుల్ తెలిపారు. ముంబైలోని హోట‌ల్‌లో క‌లిసిన రియాజ్ త‌న‌కు మంత్రి ప‌ద‌విని ఆఫ‌ర్ చేశాడ‌ని, ఓ సీనియ‌ర్ రాజ‌కీయ నేత ఈ ప‌ని చేస్తాడ‌ని అందుకు ఆయ‌న‌కు రూ 100 కోట్లు చెల్లించాల‌ని చెప్పాడ‌ని తెలిపారు. 20 శాతం డ‌బ్బును అడ్వాన్స్‌గా చెల్లించాల‌ని రియాజ్ డిమాండ్ చేశాడ‌ని చెప్పారు. అడ్వాన్స్ చెల్లించేందుకు సిద్ధ‌మ‌ని మ‌నం త‌ర్వాత క‌లుద్దామ‌ని చెప్పాన‌ని రాహుల్ కుల్ తెలిపారు.

ఈలోగా రియాజ్ వ్య‌వ‌హారాన్ని పార్టీ పెద్ద‌ల దృష్టికి తీసుకువెళ్లిన రాహుల్ ఆపై మెరైన్ డ్రైవ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్ వివేక్ ఫ‌న‌స‌ల్క‌ర్ ఈ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు అప్ప‌గించారు. ఇక ఎమ్మెల్యే నుంచి అడ్వాన్స్‌ తీసుకునేందుకు హోట‌ల్‌కు రావాలంటూ నిందితుల‌పై వ‌ల‌ప‌న్నిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చాక‌చ‌క్యంగా నిందితుల‌ను అరెస్ట్ చేశారు. అరెస్ట‌యిన నిందితుల‌ను రియాజ్ షేక్‌, యోగేష్ కుల‌క‌ర్ణి, సాగ‌ర్ సంఘ్వి, జాఫ‌ర్ ఉస్మానిగా గుర్తించారు. నిందితుల నుంచి పోలీసులు మూడు మొబైల్ పోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

ShareSendShareTweet
Previous Post

 కామన్వెల్త్‌ పోటీల్లో మహిళల క్రికెట్..

Next Post

అట బొమ్మతో సముద్రంలో బయట పడ్డాడు

Related Posts

కర్ణాటక దెబ్బ.. బీజేపీకి గుణపాఠమే..
జాతీయం

కర్ణాటక దెబ్బ.. బీజేపీకి గుణపాఠమే..

May 13, 2023
15 మందిని పోటీకి దించినా..  గెలిచింది ‘గాలి’ ఒక్కడే..
జాతీయం

15 మందిని పోటీకి దించినా.. గెలిచింది ‘గాలి’ ఒక్కడే..

May 13, 2023
జ్ఞాన‌వాపి శివ‌లింగానికి కార్బ‌న్‌డేటింగ్‌
జాతీయం

జ్ఞాన‌వాపి శివ‌లింగానికి కార్బ‌న్‌డేటింగ్‌

May 12, 2023
Next Post
అట బొమ్మతో సముద్రంలో బయట పడ్డాడు

అట బొమ్మతో సముద్రంలో బయట పడ్డాడు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

You May Like

అవినాష్-సీబీఐ దొంగాట

అవినాష్-సీబీఐ దొంగాట

by V Srinivas
May 21, 2023

Facebook Twitter Youtube

ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.

Read More

Categories

  • For U
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • అభిప్రాయం
  • ఆధ్యాత్మికం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • జనరల్
  • జాతీయం
  • టూరిజం
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • సోషల్ మీడియా

Pages

  • Contact
  • ఇ-పేపర్
  • Privacy Policy
  • Disclaimer

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved

No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved