ప్రజల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాల్లో నవంబర్ 1వ తేదీ నుంచి పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. బీమా క్లెయిమ్కు కేవైసీ తప్పనిసరి, ఎల్పీజీ సిలిండర్ డెలివరీకి ఓటీపీ, రైల్వే సర్వీసుల కొత్త టైం టేబుల్ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
సిలిండర్ హోం డెలివరీకి ఓటీపీ:
ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ చేసుకొనే సమయంలో వినియోగదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. నవంబర్ 1 నుంచి ఇంటివద్ద డెలివరీ సమయంలో ఆ ఓటీపీ చెప్తేనే సిలిండర్ ఇస్తారు.
రైళ్ల కొత్త టైం టేబుల్:
పలు దూర ప్రయాణ రైలు సర్వీసులకు సంబంధించి రైల్వే శాఖ కొత్త టైం టేబుల్ను ప్రకటించింది. దీని ప్రకారం 13 వేల ప్యాసింజర్ రైళ్లు, 7 వేల గూడ్స్ రైళ్ల టైమింగ్స్ మారుతాయి. దేశవ్యాప్తంగా నడిచే 30 రాజధాని రైళ్ల టైమింగ్స్లో కూడా నవంబర్ 1 నుంచి మార్పులు ఉంటాయి.
జీఎస్టీ రిటర్న్కు హెచ్ఎస్ఎన్ కోడ్:
నవంబర్ 1 నుంచి పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ రిటర్న్ సమయంలో నాలుగు అంకెల హెచ్ఎస్ఎన్ కోడ్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. రూ.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్నవారికి ఇది వర్తిస్తుంది.
ఇన్సూరెన్స్ క్లెయిమ్స్కు కేవైసీ:
హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) నవంబర్ 1 నుంచి కేవైసీని తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఈ కేవైసీ అనేది స్వచ్ఛందంగా ఉన్నది. కేవైసీ తప్పనిసరి విషయంలో డెడ్లైన్లో ఎలాంటి మార్పులు ఉండవని ఐఆర్డీఏఐ ఇటీవల ఓ ప్రకటనలో స్పష్టం చేసారు.