వర్షం హీరోయిన్ త్రిష సౌత్ ప్రేక్షకులకు అభిమాన తార. ఆమె రాజకీయ తెరపైకి రానుందా? అనే పుకార్లు చెక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఇప్పుడు రాజకీయాలపై దృష్టి సారించినట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఆహ్వానం పంపినట్టు.. కొన్ని ఆఫర్లు ఇవ్వడానికి సిద్ధం అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ యూత్ ను ఎంకరేజ్ చేసి పార్టీకి కొత్త రూపు ఊపు తేవాలని నాయకత్వం ప్రయత్నిస్తోంది. దానికి సంబంధించి తీర్మానాలు కూడా జరిగిన విషయం తెలిసిందే. 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల నాటికి పార్టీని వీలైనంత యువతను కొత్త గ్లామర్ ను తెచ్చేందుకు ఆ పార్టీ నాయకత్వం పావులు కదుపుతోంది. అందులో భాగంగా కాంగ్రెస్ త్రిషకు ఆఫర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీనే కాదు అన్ని పార్టీలదీ అదే దారి. గత ఎన్నికల సమయంలో సీనియర్ నటి ఖుష్బూ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. దీంతో ఇప్పుడామె లేని లోటును త్రిష ద్వారా తీర్చాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు సీనియర్ నేతలు ఇటీవల త్రిష ఇంటికి వెళ్లి చర్చలు జరిపినట్టు కొన్ని వెబ్ సైట్లు కూడా కథనాలు రాశాయి. అయితే బీజేపీ కూడా త్రిషను తమవైపు తిప్పుకునేందుకు ప్రయాత్నిస్తున్నట్టు సమాచారం.