‘ సర్కారు వారి పాట సినిమా మే 12న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ అప్పుడే మొదలు పెట్టేశారు. ఇప్పటికే తమన్, కీర్తి సురేష్ ఇంటర్వ్యూలు ఇవ్వగా తాజాగా గేయ రచయిత అనంత శ్రీరామ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.’ సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ హీరో, హీరోయిన్ గా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది. ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు సూపర్ సక్సెస్ సాధించాయి.
” సినిమా గురించి అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. ”ఈ కథ వినగానే గత ఐదేళ్ళుగా ఇలాంటి కథ రాలేదు, మరో ఐదేళ్ళ తర్వాత కూడా ఇలాంటి కథ మహేశ్ బాబు గారికి రాదు. మంచి విలువలు, కమర్షియల్ అంశాలు జోడించిన కథ దొరకడం చాలా కష్టం. ఇలాంటి కథ మహేష్ బాబు గారికి వచ్చింది. ఈ సినిమాలో భాగమైనందుకు నా భవిష్యత్ కు కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. సర్కారు వారి పాట సినిమా ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది” అని ఆనందం వ్యక్తం చేసారు అనంత్ శ్రీరామ్. ఇక సినిమాలోని పాటలు గురించి మాట్లాడుతూ.. ”ఇందులో నాలుగే పాటలు ఉంటాయి. అవి కూడా అద్భుతమైన సన్నివేశాల వద్దే వస్తాయి. అవసరమైన చోటే పాట పెట్టడం జరిగింది. పాటలు లేకుండా కూడా సినిమాలు చేసినా మన తెలుగు ప్రేక్షకులు మాత్రం పాట కోరుకుంటారు. సర్కారు వారి పాటకి చాలా వర్క్ జరిగింది. సాహిత్యం పరంగా ఎప్పటికప్పుడు కొత్తగా మార్పులు చేర్పులు చేస్తూ వచ్చాం. ఈ సినిమాలో పాటలు రాయడానికి నాకు 190 పేజీల వైట్ నోట్ బుక్స్ నాలుగు అయిపోయాయి. ఇప్పటికే రెండు పాటలు వచ్చి భారీ విజయాన్ని సాధించాయి. రాబోయే మరో రెండు పాటలు కూడా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తాయి” అని అభిప్రాయపడ్డారు.