బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు భారీ భద్రత కల్పించారు. సల్మాన్ ను చంపేస్తామంటూ ముంబాయికి చెందిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం ‘కబీ ఈద్ కబీ దివాళి’ షూటింగ్ కోసం సల్మాన్ హైదరాబాదుకు వచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. అయితే పంజాబీ సింగర్ సిద్ధును చంపినట్టు సల్మాన్ ను చంపుతామని ఒక లేఖను విడుదల చేశాడు గాంగ్ స్టర్. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు సల్మాన్ ఇంటి వద్ద కూడా భద్రతను పెంచారు. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేనంత భద్రతతో ఆయన హైదరాబాద్ లో అడుగుపెట్టారు.