ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను ఇక ఆన్లైన్లో విక్రయించాలని నిర్ణయించింది. అంతే కాదు ప్రతి టికెట్పైనా రెండు శాతం కమీషన్ వసూలు చేయనుంది. సినిమా టికెట్ల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వమే ఆన్లైన్ ద్వారా టికెట్లు విక్రయించాలన్న ప్రతిపాదన ఇటీవల రచ్చరేపింది. అయితే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSFTVDC) ద్వారా ప్రభుత్వం ఆన్లైన్లో టికెట్లు విక్రయించవచ్చని తెలిపింది. . ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సినిమా టికెట్లను ప్రభుత్వం ఆన్లైన్లో విక్రయించనుంది. ఇక నుంచి రాష్ట్రంలోని ఏ మూలన సినిమా చూడాలన్నా ఈ పోర్టల్ ద్వారానే టికెట్లను కొనుగోలు చేయాలి. ఒకవేళ ప్రైవేటు యాప్ల ద్వారా టికెట్లు కొనుగోలు చేసినా ప్రభుత్వానికి రెండుశాతం కమీషన్ చెల్లించాల్సిందే.