ఒకే కుటుంబం నుంచి ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కలిసి నటిస్తే వారి అభిమానులకు వచ్చే కిక్కే వేరు. అలా నటిస్తే అది ఫాన్స్ కి ఓ అద్భుత దృశ్య కావ్యం అవుతుంది. ఇప్పుడు మెగా అభిమానులకు అలాంటి అదిరిపోయే అప్డేట్ను అందించాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. తారక్ తో కలిసి అతడు నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ విజయాన్ని చెర్రీతో పాటు అతడి అభిమానులు ఆస్వాదిస్తుండగానే మరోపక్క మెగా స్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇందులో రాంచరణ్ కూడా ఓ కీలక పాత్రను పోషించడం తెలిసిందే.
ఈ సినిమా సూపర్ హిట్ కావడం ఖాయమని ఈ చిత్రబృందంతోపాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా నమ్ముతున్నాయి. కాగా ఇదే సమయంలో మెగా ఫ్యామిలీ అభిమానులను మరింత మురిపిస్తూ చెర్రీ మరో శుభవార్త వినిపించాడు. బాబాయ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్తో కలిసి ఓ సినిమాలో నటించనున్నట్టు వెల్లడించాడు. అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. చెర్రీ ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఓ ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటిస్తున్నారు. బహుశా ఆ తరువాత పవన్, రాంచరణ్ కలిసి నటించే చిత్రం ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు సాకారమైతే మెగాభిమానులకు పూనకాలు రావడం ఖాయమేనని చెప్పాలి.