దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాలపై ప్రేక్షకుల్లో ఏస్థాయి అంచనాలుంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇక కెరీర్లోనే సూపర్ ఫామ్లో ఉన్న సూపర్ స్టార్ మహేష్తో తానుతెరకెక్కించనున్నతొలి సినిమా గురించి ఏస్థాయిలో ప్రేక్షకులు ఊహించుకుంటారో రాజమౌళికి బాగా తెలుసు. అందుకే ఏకంగా ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో ప్లాన్ చేశారు జక్కన్న. ఈ చిత్ర కథ గురించి ఇప్పటిదాకా రాజమౌళి ఎలాంటి అప్డేట్ ఇవ్వనప్పటికీ ఇది ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని, మహేష్ ఇమేజ్కు తగినట్టుగా విజయేంద్రప్రసాద్ తనదైన శైలిలో ఒక అద్భుతమైన కథను ఇప్పటికే సిద్ధం చేశారని, దానిని మరింత మెరుగుపరచేందుకు స్క్రిప్టు వర్కు జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్పై అత్యధిక బడ్జెట్తో తెరకెక్కబోయే మూవీ కూడా ఇదే కానుందని తెలుస్తోంది.
ఇక తన సినిమాలు ఇంకా సెట్స్పైకి వెళ్లకముందునుంచే వాటిపై హైప్ క్రియేట్ చేయడంలో రాజమౌళి తరువాతే ఎవరైనా అనిచెప్పాలి. వీటిలో భాగమో ఏదో తెలియదు గానీ ఈ చిత్రానికి సంబంధించి ఓ తాజా వార్త రెండు రోజులుగా మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ మహేష్ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించబోతుందన్నదే ఆ వార్తా సారాంశం. దీనికి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది.. అంతేకాదు.. ఈ చిత్రంలో దక్షిణాదికి చెందిన ఓ సీనియర్ హీరోతో పాటు, కొందరు బాలీవుడ్ నటులు కూడా ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మహేష్- త్రివిక్రమ్ కాంబోలో రూపొందనున్నమూవీ పూర్తి చేశాక ఈ ఏడాది చివరిలోరాజమౌళి చిత్రం మొదలయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటినుంచే ఈ సినిమాకు ఈ స్థాయి హైప్ క్రియేట్ అయితే ఇక సినిమా చిత్రీకరణ మొదలయ్యాక రాజమౌళి టీం ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో చూడాల్సిందే.