ప్రముఖ హీరోయిన్ మీనా భర్త విద్యా సాగర్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే.. అయతే ఆ మరణంపై మీడియాలో అసత్య ప్రసారాలు జరుగుతున్నాయి. భర్త దూరమయ్యారనే బాధలో తానుంటే… తన భర్త మరణంపై అసత్య వార్తలను ప్రసారం చేస్తున్నారంటూ మీనా ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య వార్తలను నిలిపివేయాలంటూ ఆమె సోషల్ మీడియా వేదికగానే ఓ భావోద్వేగ ప్రకటన చేశారు.
తన పరిస్థితిని అర్థం చేసుకుని తన కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించవద్దంటూ మీనా కోరారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. తన భర్త ప్రాణాలను కాపాడేందుకు తమిళనాడు సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులు శాయశక్తులా కృషి చేశారని కూడా ఆమె వెల్లడించారు.
మీనా ఇంటికి సమీపంలో అధికసంఖ్యలో పావురాలు ఉంటాయని, వాటి వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చిన కారణంగానే విద్యా సాగర్కు శ్వాస సంబంధ సమస్యలు వచ్చాయని అందుకే ఆయన మరణించారంటూ పలు వార్తా సంస్థలు కథనాలు వెలువరించాయి. ఈ వార్తలపైనే మీనా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కథనాలపై మీనా అభిమానులు మండిపడుతున్నారు.