ప్రపంచవ్యాప్తంగా పేరుగడించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ప్రభాస్ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తారు. అయితే ఆయన హీరోగా బాలీవుడ్ లో ‘ఆదిపురుష్’ మూవీ చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి చాలా ప్రత్యేకతలున్నాయి. అందులో ముఖ్యమైంది పలు భాషల్లో విడుదల చేయడం. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిపోయింది. అలాగే వచ్చేఏడాది 12న సినిమా విడుదల చేస్తారని నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే ఇంతర వరకు ఆదిపురుష్ గురించి ఏ సమాచారం, ప్రచారం లేదు. దీనితో ప్రభాస్ అభిమానులు నిరాశతో ఉన్నారు.
అయితే ఇప్పుడు ఒక తాజా సమాచారం వచ్చింది. అదే ఆ మూవీ టీజర్ గురించి. అదిరిపోయేలా.. కళ్లు మిరుమిట్లు గొలిపేలా టీజర్ విడుదల చేయనున్నారు. దసరా సందర్భంగా ఆ రోజు శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించగా.. సీత పాత్రలో కృతి సనన్, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ ప్రకటనతో ఫ్యాన్సు యమజోరుగా ఉన్నారు.