“క్రీస్తు పూర్యం 1350 సంవత్సరంలో వచ్చిన భూకంపంలో ఆ నగరం కాలగర్భంలో కలిసిపోయింది. తర్వాత వందల ఏళ్ల వరకు అక్కడ ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు..” అని చరిత్ర కారులు, పురాత్వత్వ్య శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.”
ఇరాక్ లో కొన్నేళ్లుగా ప్రజలు నీటి కోసం అల్లాడిపోతున్నారు. కరవుతో కటకటలాడుతున్నట్లే. ఇలాంటి పరిస్థితులు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే.. దేశంలోనే పెద్దదైన మోసుల్ డ్యామ్ నీటి నిల్వలు నిండుకుని., ఎండిపోయే స్థితికి చేరుకోవడమే. ఇలాంటి పరిస్థితులు దాదాపు 3,400 సంవత్సరాల పూర్వం ఈజిప్ట్ను టుటాఖమున్ పరిపాలిస్తున్న కాలంలో ఉండేవని చరిత్ర చెబుతోంది. ప్రస్తుత ఉత్తర ఇరాక్, సిరియా దేశాలు మధ్య రాతి యుగం సమయంలోని మిత్తాని రాజ్యంలోని భాగాలే అని కొద్ది రోజులుగా అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఒక నగరం ఉన్నట్లు దానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లను పురావస్తుశాఖ తవ్వకాలలో వెలుగుచూశాయి. కొన్ని మట్టి కుండలు, మట్టి ఇటుకలను గుర్తించగా వాటిపై 1500-2000 సంవత్సరాల ముందు రాతలు, గుర్తులు ఉన్నట్లు బయటపడింది.