” ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థలు ఉద్యోగుల రిక్రూట్ మెంట్ వేగాన్ని తగ్గిస్తున్నాయ్.
కార్ల కంపెనీలు ఉత్పత్తిని ఇప్పటికే తగ్గించాయి. ఉద్యోగులను కూడా తేసేస్తున్నాయ్..
ఇలా అన్ని రంగాలలోను ఆర్ధిక మాంద్యం సెగలు మొదలయ్యాయి..”
ఇపుడు ఇదే అంశంపై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మల్ పాస్ కూడా హెచ్చరిస్తున్నారు. ముక్యంగా అమెరికా, బ్రిటన్ లాంటి ధనిక దేశాలలో ఆర్ధిక మాంద్యం ఆనవాళ్లు ముందే మొదలయ్యాయి. పలు కంపెనీల సీఈఓ లు, ఆర్ధిక వేత్తలు ఈ విషయంపై ఇప్పటికే పలు సూచనలు చేసారు. మన దేశంలో ముక్యంగా రియాల్టీ రంగంలో ఏడాది నుంచి స్టబ్టత నెలకొంది. హైదరాబాద్, చెన్నై వంటి మహానగరాలలో లక్షల కొద్దీ ఫ్లాట్స్ అమ్ముడుపోక ఖాళీగా ఉన్నాయి. ఇదే పరిస్థితి నగరాలూ, పట్టణాలలోని నెలకొంది. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే? 2023లో ప్రపంచ బ్యాంక్ ఆర్ధిక వృద్ధి రేటు 3 నుంచి 1.9 శాతానికి తగ్గే అవకాశం ఉంది.. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు, పెట్టుబడుల .కోత వంటి సమస్యలు పేద వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.. అని మల్ పాస్ ఆందోళన వ్యక్త్య0 చేసారు. అలాగే అభివృద్ధి చెందిన దేశాలలో రుణ భారం కలవరపెడుతుందన్నారు. భారీ రుణాలు తీసుకోవడం ఒకటి.. వడ్డీలు కట్టలేకపోవడం ఒకటి.. అని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు పేర్కొన్నారు.
భారత్ కు మాంద్యం దెబ్బ: రాబోయే రోజుల్లో భారత్ కూడా ఆర్ధిక మాంద్యం దెబ్బ నుంచి తప్పించుకోలేదు. ఇప్పటికే ఈ సంకేతాలు కనిపిస్తున్నాయ్. నాలుగైదు నెలలుగా మార్కెట్ లో నగదు లభ్యత తగ్గింది. రానున్న ఆరేడు నెలల కాలంలో ఆర్ధిక మాంద్యం మరింత చుట్టుముట్టే ప్రమాదం కనిపిస్తుందని పలు కంపెనీలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.