“పురాతనమైన, దేశ వారసత్వ సంపదైన అరుదైన కళాఖండాలు మాయమయ్యాయి. ఇటీవల శ్రీలంక సంక్షోభం సమయంలో అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయిన సందర్భంలో నిరసనకారులు అధ్యక్ష భవనంలోకి ప్రవేశించారు. ఆ సమయంలోనే ఇవి మిస్సయినట్లు తెలుస్తోంది..”
శ్రీలంక అధ్యక్ష భవనంతోపాటు ప్రధానమంత్రి వ్యక్తిగత నివాసం నుంచి ఇటీవల దాదాపు వెయ్యికిపైగా విలువైన కళాఖండాలు మాయమయ్యాయి. స్థానిక పోలీసులు శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో అత్యంత పురాతన, అరుదైన వస్తువులు ఉన్నట్లు తెలిపారు. ఆర్థిక సంక్షోభం నిర్వహణలో వైఫల్యాన్ని నిరసిస్తూ.. జులై 9న లక్షల సంఖ్యలో నిరసనకారులు మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సతోపాటు మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘేనివాసాల్లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.