” ఆధునిక ఆహారపు అలవాట్ల వల్లే క్యాన్సర్ సోకుతుందని శాస్త్రీయ పరిశోధనలు రుజువు చేస్తున్నాయ్. అయితే 2 వేల ఏళ్ల క్రితమే క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది.”
2000 ఏండ్ల క్రితమే క్యాన్సర్ వ్యాప్తి ఉన్నట్టు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ప్రపంచంలో మొట్టమొదటి గర్భి ణీ మమ్మీగా గుర్తింపు పొందిన ‘మిస్టీరియస్ లేడీ’ ఈ వ్యాధితోనే మరణించినట్టు పేర్కొన్నారు. కడుపులో పిండం 28 వారాల వయసులో ఉన్నప్పుడే క్యాన్సర్ కారణంగా ఆమె మరణించిందని చెప్పారు. ‘‘మిస్టీరియస్ లేడీ’పై లోతైన పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఈ నిర్దారణకు వచ్చారు.