అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా ఖగోళ శాస్త్రవేత్తలు అంగారకుడి మీద నుంచి భూమి మీదకు మట్టిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ మట్టిలో మానవ పరిశోధనలకు అందని ఏదైనా వైరస్ ఉంటే ఎలా.. అది మానవాళికి ముప్పుగా పరిణమిస్తే ఎలా అనే అనుమానాలు సైన్టిస్టుల మెదళ్ళకు పదును పెడుతోంది. ‘ఆండ్రోమెడా స్ర్టెయిన్’ అనే నవలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఆ నవల్లో కూడా శాస్త్రవేత్తలు అంతరిక్షం నుంచి మట్టిని తీసుకువచ్చి భూమిపై పరిశోధనలు చేస్తారు. అందులో ఉన్న ప్రమాదకర వైరస్ భూమిపై ఉన్న సగం జనాభాను చంపేస్తుంది. ఈ అనుమానాలపై నాసా ప్లానెటరీ ప్రొటెక్షన్ మాజీ అధికారి కాసీ కోన్లే స్పందించారు. అంతరిక్షం నుంచి తెచ్చిన మట్టిపై అత్యంత సురక్షితమైన ల్యాబ్లోనే పరిశోధనలు చేస్తారన్నారు. మార్స్పైన ఉన్న మట్టితో ప్రమాదం ఏమీ లేదని పేర్కొన్నారు. నిజానికి మార్స్ మట్టిపై అక్కడ పరిశోధనలు చేయలేమని, అత్యంత అధునాతమైన ల్యాబ్లు అవసరమని, మార్స్ నమూనాలను భూమిపైకి తీసుకురావడం అనివార్యం అని పలువురు శాస్త్రవేత్తలు చెపుతున్నారు. చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టిలో ఇటీవల శాస్త్రవేత్తలు మొక్కలను మొలిపించిన విషయం తెలిసిందే. దీంతో ఈ పరిశోధనలకు మరింత ప్రోత్సాహం లభిస్తోంది.