గతంలో తనపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇచ్చారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సతీమణి అక్షతామూర్తి. ఇకపై ప్రపంచ వ్యాప్తంగా తాను సంపాదించే సంపాదనపై యూకేలో కూడా పన్ను చెల్లిస్తానని ప్రకటించారు. తాజాగా ఆమెకు రూ.126 కోట్ల ఆదాయం రావడం వల్ల ఆమె ఇప్పుడు బ్రిటన్లో పన్ను చెల్లించారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.
అక్షతకు భారత్ పౌర సత్వం ఉండటం వల్ల బ్రిటన్ లో వచ్చిన ఆదాయానికి మాత్రమే ఇన్నాళ్లు పన్ను చెల్లిస్తున్నారు. తన నాన్ డొమిసిల్ హోదాను అక్షత మరో ఏడాది పొడిగించుకున్నారు. దీనికోసం 30 వేల పౌండ్లు చెల్లించారు. ఈమె భర్త రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కావడంతో అక్షత ఆదాయం, పన్నులపై మరోమారు విమర్శలు తెరపైకి వచ్చాయి.