ప్రపంచ వ్యాప్తంగా ఆంక్షలు కొనసాగుతున్నా.. జన్యు సవరణ పంటలకు చైనా మాత్రం ఆమోదం తెలిపింది. చైనాకు చెందిన షెన్డాంగ్ షున్ఫెంగ్ కంపెనీ జన్యు సవరణ సోయాబీన్ పంటకు అనుమతులు పొందింది. 5 సంవత్సరాలకు అనుమతులు పొందిన ఈ కంపెనీ మార్కెటింగ్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. ఈ సోయాబీన్లో రెండు రకాల జన్యువులు ఉంటాయి. ఇవి కొవ్వు పదార్థమైన ఒలెయిక్ యాసిడ్ను మొక్కకు అందించి ఆరోగ్యకరంగా ఉంచుతుందని కంపెనీ చెపుతోంది. . ఇప్పటికే అధిక దిగుబడి ఇచ్చే వరి, జొన్న, మక్కజొన్న, విటమిన్-సీ అధికంగా ఉండే పాలకూర తదితర 20 రకాల పంటలపై ఈ కంపెనీ పరిశోధనలు చేస్తున్నది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైన నాటి నుంచి చైనా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చైనాలోని మధ్య తరగతి సరైన తిండికి నోచుకోవటం లేదు. ఈ పంట ద్వారా ఆహార సంక్షోభం నుంచి కొంతమేరకైనా బయటపడొచ్చని చైనా శాస్త్రవేత్తలు యోచిస్తున్నారు.