నిర్జనంగా, ఎర్రటి ఎడారిగా కనిపించే అంగారక గ్రహం.. ఒకప్పుడు (వేల, లక్షల ఏళ్ల క్రితం) నీళ్లతో నిండి నీలి రంగులో కనిపించేదని తాజా అధ్యయనం పేర్కొన్నది. మార్స్పై గతంలో నీరు ఉండేదని పరిశోధకులు చాలా కాలంగా చెబుతున్నప్పటికీ, ఎంతమేరకు నీరు ఉండేదనేదిపై మాత్రం చర్చ జరుగుతూనే ఉంది. 450 కోట్ల ఏళ్ల క్రితం అంగారకుడిపై 984 అడుగుల లోతు మహాసముద్రాలు ఉండేవని కోపెన్హగెన్ శాస్త్రవేత్తలు తాజాగా పేర్కొన్నారు. వందల కోట్ల సంవత్సరాల క్రితం మార్స్ను మంచుతో కూడిన గ్రహశకలాలు ఢీకొట్టాయని తెలిపారు.