నవరా రైస్ . త్రేతా యుగంలో విరివిగా తినే ఆహార ధాన్యం ఇది. ఈ బియ్యం ఎరుపు రంగులో ఉంటాయి. కేరళ సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలోను, ప్రసాదాలలోను ఎక్కువగా వినియోగిస్తారు. పాలిష్, (వైట్) రైస్ తో పోలిస్తే ఈ బియ్యంలో ఎన్నో రేట్లు పోషకాలు అధికంగా ఉంటాయి.
ఈ రైస్ లో ఫైబర్ ఎక్కువ. కప్పు బియ్యంలో… 8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ప్రతీ వ్యక్తికీ రోజూ 8 గ్రాముల ఫైబర్ అవసరం. వైట్ రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. ఎరుపు బియ్యంలో అవి తక్కువే. అందువల్ల ఎర్ర బియ్యం తినేవారికి మల బద్ధకం సమస్యే ఉండదు. అలాగే డయాబెటిస్, గుండె జబ్బులు, అధిక బరువు సమస్యలు రావు. నవరా తో పాటు.. థాయ్ రెడ్, భూటాన్ రెడ్, కామర్గ్ రెడ్, కేరళలో పండే మట్టా రైస్, .. ఇలా ఎరుపు రంగు బియ్యం చాలా రకాలు ఉన్నాయ్. అయితే నవర బియ్యం షుగర్ లెవిల్ ని నియంత్రించినట్లు ఇతర రకాలు పనిచేయడంలేదు.
బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ : ఎర్రబియ్యంలో బ్లడ్ షుగర్ను తగ్గించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గితే… ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవుతుంది. అది సరిగా ఉత్పత్తి అయితే… షుగర్ వ్యాధి వచ్చే సమస్య ఉండదు. అందువల్ల డయాబెటిస్ కంట్రోల్లో ఉండాలంటే… రోజు ఒక పుట నవరా అన్నం తినాలి.
గుండెకు మేలు, కొలెస్ట్రాల్కు చెక్ : బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించే శక్తి ఎర్ర బియ్యానికి ఉంది. ఎప్పుడైతే చెడు కొవ్వు తగ్గుతుందో… గుండెకు రక్త సరఫరా సరిగ్గా సాగుతుంది. అంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎర్రబియ్యంలోని మెగ్నీషియం… బీపీని క్రమబద్ధీకరిస్తుంది. అందువల్ల బీపీ వచ్చేవారికి తరచూ వచ్చే హార్ట్ ఎటాక్… ఈ రైస్ తినేవారికి పెద్దగా రాదు.
అధిక బరువుకు చెక్ : ఎర్రబియ్యంలో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో… అది అధిక బరువు రాకుండా చేస్తుంది. ఎర్రబియ్యాని మనం ఎక్కువగా తినం. కొద్దిగా తినగానే… పొట్ట ఫుల్ అయిన ఫీల్ కలుగుతుంది. ఐతే… ఈ రైస్ ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది.
ఐరన్ పుష్కలం.. : ఎర్రబియ్యంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ సరిపడినంత లేని వారు ఆక్సిజన్ను సరిగా తీసుకోలేరు . ఊరికే అలసిపోతారు. వ్యాధినిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే ఎర్ర బియ్యం మనం తినాలి. పుష్టిగా ఉండాలి.
విటమిన్ బీ6 : బీ6 విటమిన్ గ్రూప్ మనకు చాలా అవసరం. కానీ అది ఎక్కడబడితే అక్కడ, ఎందులో బడితే అందులో దొరకదు. DNAలో ఎర్రరక్త కణాలు తయారవ్వాలంటే ఈ విటమిన్ కావాలి. మన ఆర్గాన్లు ఆరోగ్యాంగా పనిచెయ్యాలంటే ఇది కావాలి. ఇంకా చాలా ప్రయోజనాలు ఈ గ్రూప్ విటమిన్లతో వస్తాయి. కాబట్టి ఎర్రరైస్ తినడం బెటర్.
యాంటీఆక్సిడెంట్స్ లభ్యం : రెడ్ రైస్లో ఆంథోసియానిన్, మాంగనీస్, జింక్ ఉంటాయి. ఇవన్నీ మన బాడీలో విషవ్యర్థాల్ని వెంటపడి తరుముతాయి. ఏవైనా సూక్ష్మక్రిములు బాడీలోకి రావాలని చూస్తే… ఎంట్రీ గేట్ దగ్గరే అడ్డుకొని… బయటకు పంపేస్తాయి. అందువల్ల మన బాడీలో కణాలు హాయిగా, హ్యాపీగా ఉంటాయి. అందువల్ల మన చర్మం త్వరగా ముడుతలు పడదు. కాన్సర్ వంటి రోగాలు రావు. గాయాలు త్వరగా తగ్గిపోతాయి. బ్రెయిన్ అద్భుతంగా పనిచేస్తుంది. అన్నీ లాభాలే.
ఎముకలకు పుష్టి : రెడ్ రైస్లో కాల్షియం, మాంగనీస్ ఉంటాయి. అవి ఎముకల్ని పుష్టిగా, గట్టిగా, బలంగా, పటిష్టంగా మార్చేస్తాయి. అప్పుడు ఎముకలు చిట్లే, పగిలే, బీటలొచ్చే ప్రమాదం ఉండదు. ముసలితనంలో అస్థియోపోరోసిస్ వ్యాధి దరి చేరదు.
మెనోపాజ్ తర్వాత మహిళలు చాలా బాధ, నొప్పిని అనుభవిస్తారు. వాళ్లు ఎర్ర బియ్యం తింటే ఉపశమనం పొందుతారు. ఆస్తమా నుంచీ రిలీఫ్ పొందేందుకు కూడా ఎర్ర బియ్యం ఉపయోగపడతాయి. తిరిగి నార్మల్గా ఊపిరి పీల్చుకునే పరిస్థితి వస్తుంది. సో… ఇన్నాళ్లూ వైట్ రైస్ తింటున్న మనం… క్రమంగా రెడ్ రైస్ వైపు మళ్లితే మంచిదే.
ఎలా వండుకోవాలి.. ఎర్ర బియ్యాన్ని వండుకునే ముందు 6-8 గంటలు నీళ్లలో నానపెట్టాలి. అంటే రాత్రి పడుకునే ముందు నానపెట్టుకుంటే ఉదయం వండుకునేందుకు రేడీ అవుతాయి. ఒక గ్లాస్ బియ్యానికి, 3 గ్లాసుల నీళ్లు పోసి వండాలి. రోజు ఒక పుట చొప్పున 60 రోజులపాటు క్రమం తప్పకుండ తింటే షుగర్ లెవిల్ కంట్రోల్ లోకి వస్తుంది. ఈ బియ్యం అన్నం తినడం మొదలు పెట్టె ముందు షుగర్ టెస్ట్ చేయించుకుని.. 60 రోజుల తర్వాత టెస్ట్ చేయించుకుంటే మీకే తెలుస్తుంది.
అయితే మీకు తెలిసిన వారి ద్వారా ఆరా తీసి ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న రైతుల దగ్గర నేరుగా కొనిక్కొంది. ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ లో తెప్పించుకుంటే.. వాటిలో నవరా పేరుతొ హైబ్రైడ్ రకాల ఎర్ర బియ్యం కూడా అమ్మేస్తున్నారు. అవి తింటే ఫలితాలు రావు. మట్టి కుండలో వండు కుంటే పోషకాలు వృధా కాకుండా సంపూర్ణ0గా పొందవచ్చు. నవర రైస్ ..అన్నమే కాకుండా.. దోసెలు, ఇడ్లీ, ఉప్మా వంటివీ చేసుకుని తినవచ్చు.