భారతీయులు తులసిని అత్యంత పవిత్రంగా కొలుస్తారు. అనాదిగా వస్తున్న ఈ ఆచారం వెనుక ఎన్నో ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. తులసి మొక్క ఇంటి పెరట్లో ఉంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు దరి చేరవని మన పెద్దల నానుడి. తులసి ఆకులు రెగ్యులర్ గా తీసుకునే వారిలో వైరస్ సమస్యలు అస్సలు దరిచేరవని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయడం, పూజించడం వంటి సంప్రదాయాల వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి.
మనలో కొందరు గొంతులో కఫం బాగా ఉండడం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతుంటారు. ఎక్కువ సేపు మాట్లిడితే దగ్గు వస్తుంది. కానీ తులసి ఆకులతో ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అందుకు గాను రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగు తులసి ఆకులను నోట్లో వేసుకుని నేరుగా అలాగే నమిలి మింగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే ఒంట్లో ఉన్న కఫం క్రమంగా తగ్గుతుంది. ఊపిరితిత్తుల్లోని కఫం కూడా బయటకు వచ్చేస్తుంది.
జీర్ణాశయం, పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములను నాశనం చేసే శక్తి తులసి ఆకులకు ఉంటుంది. తులసి ఆకులను నమిలి మింగితే.. జీర్ణవ్యవస్థలో ఉండే క్రిములు చాల వరకు నాశనం అవుతాయి. జీర్ణవ్యవస్థ మెరుగు పడుతుంది. ఇన్ఫెక్షన్లకు అడ్డుకట్ట పడుతుంది.
తులసి ఆకులను నీడలో ఆర బెట్టి పొడి చేసి అందులో నీళ్లు కలిపి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. దీంతో రోజూ దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. రోజూ చేస్తుంటే దంతాలపై ఉండే గార, పసుపు దనం పోతాయి. దంతాలు తెల్లగా మెరుస్తాయి. అలాగే చిగుళ్ల నుంచి కారే రక్తస్రావం తగ్గుతుంది. . నోట్లో సూక్ష్మ క్రిములు చనిపోతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. నోరు, దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
తులసి ఆకులను పరగడుపునే తినడం వల్ల .. రక్తహీనత సమస్యకు పరిస్కారం దొరుకుతుంది. నాలుగైదు తులసి ఆకులను తీసుకుని మెత్తగా దంచి పేస్ట్లా చేసి ఒక గుళిక (మాత్ర)గా తయారు చేసుకుని రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు ఒక మాత్ర చొప్పున వేసుకోవాలి. దీంతో జీర్ణ సమస్యలు ఉండవు. గ్యాస్, మలబద్దకం, అజీర్ణం తగ్గి ఆకలి పెరుగుతుంది.దగ్గు, జలుబు, జ్వరం ఉన్నప్పుడు ఒక టీస్పూన్ తులసి ఆకుల రసం,, ఒక స్పూన్ తేనె కలిపి రోజుకు మూడు పూటలా తీసుకోవాలి. దీంతో ఆయా సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.. ఉదయాన్నే ఒక టీస్పూన్ తేనె, తులసి ఆకుల రసం కలిపి సేవిస్తుంటే.. గొంతు బొంగురు తగ్గుతుంది