వివిధ రకాల కారం పొడులను తయారు చేసుకుని అన్నంలో వేసి తింటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే అవిసె గింజలతో కూడా మనం కారం పొడిని తయారు చేసుకోవచ్చు. అవిసె గింజలను తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. అవిసె గింజెల్ని నానబెట్టుకుని 60 రోజులపాటు ఉదయాన్నే తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది. బరువు సమస్యతో బాధపడే వారు రెండు నెలల్లో బరువు తగ్గుతారు. వెల్లుల్లి, కొంచెం కారం, సరిపడినంత ఉప్పు.. కొన్ని మిరియాలు వేసుకుని ..అవిసె గింజెల్ని వేయించి.. మిక్సీ పడితే పొడి తయారవుతుంది. పొడిని రోజూ భోజనంలో ఒక ముద్దలో కలుపుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.