కరోనా వైరస్, ఈ-కొలి, ఎంఆర్ఎస్ఏ బ్యాక్టీరియా సహా అనేక వ్యాధికారక సూక్ష్మక్రిములను చంపే ఓ క్రిమిసంహారక పూతను అమెరికాలోని మిషిగన్ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. రెండు, మూడు నిమిషాల్లోనే ఈ పూత సూక్ష్మక్రిములను నాశనం చేస్తుందని, పూతపూసిన ఉపరితలాలను తరుచూ శుభ్రంచేసినా.. నెలల తరబడి 99.9 శాతం వరకు సూక్ష్మక్రిములను చంపే సామర్థ్యం దీనికి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. కనీసం 6 నెలల వరకూ ఈ పూత క్రిములను చంపుతుందన్నారు. దీని వల్ల మనుషులకు ఎలాంటి హాని జరుగదని పేర్కొన్నారు. ఈ వివరాలు ‘మ్యాటర్’ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి.