నేరేడు పండు-ఆరోగ్య ప్రయోజనాలు
చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పోవటానికి నేరేడు పండ్లను తప్పనిసరిగా తినాలి. పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలను బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది. నేరేడు పండ్లు శరీర ఉష్టోగ్రతను అదుపులో ఉంచుతాయి. నేరేడు పండ్లను తినటం వలన రోగ నిరోదకశక్తి పెరుగుతుంది. మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. నీరసం, నిస్సత్తువ ఉన్న వారు నేరేడు పండును తింటే తక్షణ శక్తి వస్తుంది. అంతేకాదు వెన్నునొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, నయం అవుతాయి. జిగట విరేచనాలతో బాధపడే వారికి నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున ఇవ్వాలి. రోగికి శక్తితోపాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి.
* ఎర్ర రక్త కణాలు వృద్ధి చెంది ఆరోగ్యంగా ఉండటానికి నేరేడు పండు ఉపయోగపడుతుందని డాక్టర్లు సెలవిస్తున్నారు. షుగర్ పేషంట్లకు నేరేడు బోలెడంత ఉపయోగమట.
* మూత్ర సమస్యలు, కిడ్నీలో రాళ్లు ఉన్నావాళ్ళు ఈ పండు తింటే ఉపశమనం కలుగుతుంది.
* గర్భిణీ తింటే తల్లికీ, బిడ్డకీ మంచిది. మెదడును చురుగ్గా ఉంచడానికి, హార్ట్ బీట్ సరిగా ఉంచడానికి నేరేడు ఔషధంలా పనిచేస్తుంది.
* నేరేడులో విటమిన్ సీ,ఏ పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి సమస్యలు, నొప్పులను నివారించడంలో సహాయపడుతుంది.
* కాల్షియం, పొటాసియం, ఇనుము, విటమిన్-సీ అధిక మోతాదులో ఉంటాయి కనుక వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది, ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.
* ఆకు రసంలో పసుపు కలిపి పురుగు కుట్టిన చోట, దద్దుర్లు ఉన్న చోట పూస్తే ఉపశమనం కలుగుతుంది.
* జ్వరంలో ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుంది.
* నేరేడు పండ్ల రసాన్ని నిమ్మరసంతో కలిపి గాయాలున్న చోట పూస్తే.. త్వరగా మానుతుంది. ఇది మాత్రమే కాదు దీనికి రక్తాన్ని శుద్ధి చేసే శక్తి కూడా ఉంది.