నిద్రలేమి (స్లీప్ ఆప్ని యా), తక్కువ సమయం గాఢ నిద్రలోకి జారుకొనేవారికి స్ట్రోక్ ముప్పు తప్పదని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని మయో క్లినిక్ పరిశోధకులు 73 ఏండ్ల వయసున్న 140 మందిపై అధ్యయనం నిర్వహించారు. రెండేండ్లపాటు వారి మెదడును స్కాన్చేసి, విశ్లేషించారు. స్లీప్ ఆప్నియా తీవ్రంగా ఉన్న వారి మెదడులో స్ట్రోక్కు కారణమయ్యే వైట్మ్యాటర్ పెరుగుతున్నట్టు గుర్తించారు. అల్జీమర్స్, జ్ఞాపకశక్తి లోపించినట్టు తేల్చి చెప్పారు. అధ్యయన ఫలితాలు ‘న్యూరాలజీ’ అనే మెడికల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి